వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
అమరావతిలో కూర్చోని గొప్పలు చెప్పడం కాదు
29 Nov 2017 10:21 AM
కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో కూర్చొని అది చేశాం, ఇది చేశామని గొప్పలు చెప్పడం కాదని, క్షేత్రస్థాయికి వస్తే ఆయన చేసింది ఏంటో తెలుస్తుందని వైయస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైయస్ జగన్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు అమరావతిలో కూర్చొని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎలా తమ పార్టీలోకి చేర్చుకోవాలో అని పాడు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, అందుకు సజీవ సాక్ష్యమే వైయస్ జగన్ పాదయాత్రలో వస్తున్న సమస్యలు అన్నారు. వైయస్ జగన్ ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తమ గోడు వెల్లబోసుకుంటున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు వైయస్ జగన్ను ఆదరిస్తున్నారని తెలిపారు. వచ్చేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.