వైయస్‌ జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం

హైదరాబాద్ః విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  హత్యాయత్నంలో గాయపడిన ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌  రెడ్డికి సిటీ న్యూరో వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించారు. వైయస్‌ జగన్‌ గాయం నుంచి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి మరో ఆరు వారాలు పడుతుందన్నారు. భూజం కదలికల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించామన్నారు. మరోసారి వైయస్‌ జగన్‌ను పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
 

విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం జరిగిన హత్యాయత్నం ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  వైఎస్‌ జగన్‌ని శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. కత్తిపోటుకు గురై తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆయన్ను చికిత్స కోసం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని సిటీన్యూరో సెంటర్‌లో చేర్పించగా.. డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్‌ శివారెడ్డి, డాక్టర్‌ మధుసూదన్, డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌లతో కూడిన వైద్య బృందం ఆయన ఎడమచేతి భుజానికి తొమ్మిది కుట్లు వేయడం తెలిసిందే. కత్తిపోటు గాయం నుంచి సేకరించిన రక్త నమూనాల రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.

వైద్యుల సూచన మేరకు ఆయన గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఆస్పత్రిలోనే ఉన్నారు.  గాయానికి వేసిన కుట్లు చిట్లిపోకుండా ఉండేందుకు ఎడమ చేతికి సర్జికల్‌ బ్యాగ్‌ అమర్చారు.  


తాజా వీడియోలు

Back to Top