మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఈసీకే నిర్ణయాధికారం ఇవ్వాలి
18 Jun 2016 12:33 PM
హైదరాబాద్) ఫిరాయింపు
ఎమ్మెల్యేలు లేక ఎంపీల మీద చర్యలు తీసుకొనే అధికారం ఎన్నికల సంఘానికి ఇవ్వాలని
వైయస్సార్సీపీ మరోసారి డిమాండ్ చేసింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర
కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలోనే
తాము ఈ డిమాండ్ ను వినిపించామని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రమంత్రి
వెంకయ్యనాయుడు ఇదే విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు. అదే విషయాన్ని చట్టంలో
చేర్చితే మంచిదని, సభల్లో చెప్పి వదిలివేయటం వద్దని ఆయన సూచించారు. స్పీకర్ లు
సాధారణంగా అధికార పక్షానికి చెందిన వారై ఉంటారని, అటువంటప్పుడు ముఖ్యమంత్రి
స్థానంలో ఉన్నవారి చేతిలోనే ఉంటారని అభిప్రాయ పడ్డారు. అందుకే నిర్ణయాధికారాన్ని
స్పీకర్ కు కాకుండా ఎన్నికల సంఘానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనాభా మీద
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని భూమన అన్నారు.