మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
చంద్రబాబు అసమర్థత వల్లే మరణాలు
31 Mar 2017 11:15 AM
విజయవాడ: ప్రభుత్వ అసమర్ధత వల్లే రాష్ట్రంలో మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. మొగల్తూరులో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందినా ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తిపడి విచ్చల విడిగా ఫ్యాక్టరీలకు పర్మీషన్లు ఇవ్వడం వల్లే ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయన్నారు. పుష్కరాల్లో 29 మంది చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి బలైతే ఇప్పటి వరకు చార్జ్షీట్ కూడా ఫైల్ చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్షం వాస్తవాలు మాట్లాడితే ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితుల్లో లేదని దుయ్యబట్టారు. మొగల్తూరు ఆక్వాఫుడ్లో 5 మంది కార్మికుల మరణానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు. తుందుర్రు ఫ్యాక్టరీకి పైపులైన్ వేస్తామని గత రివ్యూ మీటింగ్లో చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక్క అడుగైనా పైపులైన్ పడిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం, పొల్యూషన్ డిపార్టుమెంట్ కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతున్నాయన్నారు. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఇలాంటి కంపెనీలకు పర్మీషన్లు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.