ఇస్రో శాస్త్రవేత్తలకు వైయ‌స్‌ జగన్‌ అభినందనలు 

తాడేప‌ల్లి: సీఎంఎస్‌3 ఉపగ్ర­హంతో కూడిన ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్‌ను  విజయవంతంగా ప్రయో­గించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలకు మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశ అంతరిక్ష విజయాల్లో ఇదొక మైలురాయి అని కొనియాడారు.
 
ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్ష సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అలాగే రాబోయే దశాబ్దాలకు ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తుందని వైయ‌స్‌ జగన్‌ ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

Back to Top