చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
ఎస్పీవై రెడ్డికి అనర్హత తథ్యం: సోమయాజులు
26 May 2014 1:30 PM
హైదరాబాద్:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తుపై గెలిచి టీడీపీ కండువా కప్పుకున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి అనర్హత వేటు తథ్యమని పార్టీ సలహాదారు డీఏ సోమయాజులు అన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్తే రాజ్యాంగం ప్రకారం అనర్హులవుతారని ఆయన గుర్తుచేశారు. ఎస్పీవై రెడ్డి ఆదివారం ఉదయం ఢిల్లీలో టీడీపీలో చేరిన అనంతరం సోమయాజులు స్పందించారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి అనైతిక చర్యకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని ఆయన అన్నారు.
గుర్తింపు లేనందున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీలో చేరిన ఎస్పీవై రెడ్డికి తిరుగుబాటు నిబంధన వర్తించదని యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను సోమయాజులు ఖండించారు. కామన్ గుర్తు ఉన్నప్పటికీ అభ్యర్థులను స్వతంత్రులుగానే గుర్తిస్తారన్న యనమల వాదనను ఆయన తూర్పారపట్టారు. ఎన్నికలలో పోలైన ఓటింగ్ శాతాన్ని బట్టి వైయస్ఆర్సీపీ గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని యనమలే పేర్కొనడం గమనార్హం.