<strong>విజయనగరంః </strong>గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో టీడీపీ పాలనలో జరుగుతున్న పరిణామాలు ప్రజలు అర్థం చేసుకున్నారని వైయస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జీ శ్రీనివాసరావు అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థల విలువలను చంద్రబాబు తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.వైయస్ జగన్పై హత్యాయత్నం చంద్రబాబు ప్రోదల్భంతోనే జరిగిందనడానికి ఏ మాత్రం సందేహాం లేదన్నారు. సీనియర్ నేతగా 40 ఏళ్లు అనుభవం ఉందన్న చెప్పుతున్న చంద్రబాబు వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాల్సిన చంద్రబాబు ఆ వ్యవస్థనే వద్దు అంటూ చంద్రబాబు తీరుతో ప్రజల్లో అభిమానం పూర్తిగా కొల్పోయారని చెప్పారు.తనను తాను కాపాడుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యం ఇది మంచిది కాదన్నారు. ,