ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే..!

వైఎస్సార్ జిల్లాః  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివక్ష పూరితమైన పాలనకు పాల్పడుతోందని వైఎస్ఆర్సీపీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జిల్లాకు ఉక్కు పరిశ్రమ రాకుండా పోయిందని అన్నారు.

సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జిల్లాపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో పంటలు ఎండిపోతున్నా సాగునీరు ఇవ్వడం లేదని , తక్షణమే  నికర జలాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
Back to Top