వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అభివృద్ధి చేయాల్సిన ఆంధ్రరాష్ట్రాన్ని అవినీతి చేస్తారా?
15 Jul 2018 3:29 PM
నెల్లూరు: విభజనతో అన్యాయానికి గురైన అంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి పరచాల్సిన చంద్రబాబు.. తన నాయకుల చేత విచ్చలవిడిగా దోపిడీని ప్రోత్సహిస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు కాంట్రాక్ట్లుగా మారి అవినీతికి పాల్పడుతున్నారన్నారు. నెల్లూరు రూరల్ మాగంటి లేఅవుట్లో వేసిన రోడ్డు రోడ్డు రెండు వారాలకే కుంగిపోయిందని, ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన ఆర్ అండ్ బీ అధికారులు, కుంగిపోయిన రోడ్డుకు బిల్లులు ఆపేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ఎమ్మెల్యే ఆందోళన విరమించారు.