ఎమ్మెల్యే చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభం

నెల్లూరుః నగరంలోని 46వ డివిజన్ కాపువీధిలో స్థానిక కార్పొరేటర్ వేలూరు సుధారాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, మేయర్ ద్వారకానాథ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...కాపువీధి ప్రాంతానికి నిత్యం వందలాది మంది వస్తుంటారని, వారి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వ్యాపారస్తులు కూడ ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Back to Top