మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
2014లో జగనే సీఎం: బాలనాగిరెడ్ది
16 Nov 2012 9:53 AM
పెద్దకడబూరు:
తన పాలనలో ఏమి చేయలేని చంద్రబాబు నాయుడు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. మహానేత కుమార్తె షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం గురువారం పెద్దకడబూరుకు చేరింది. స్థానిక బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రసంగించారు. తొమ్మిదేళ్లు అభివృద్ధిని మరిచి, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు నాయుడి పాలనను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరన్నారు. మీ కోసం వస్తున్నా పాదయాత్ర చేస్తున్న బాబుకు కాళ్ల నొప్పులే తప్పా ప్రయోజనముండదన్నారు. 2014లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ప్రజలందరూ ఎప్పటికీ వైయస్ఆర్సీపీ వెంట ఉంటారని చెప్పారు.