‘ఎల్లుండి జాతీయ ఎస్టీ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తాం’

వైయ‌స్ఆర్‌సీపీ నేత,  మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

పార్వతీపురం మన్యం జిల్లా:  పచ్చకామెర్లు సోసిక కురుపాం గిరిజన విద్యార్థుల వైద్క నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని వైయ‌స్ఆర్‌సీపీ నేత,  మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు.  ఎల్లుండి(మంగళవారం, అక్టోబర్‌ 14వ తేదీ)  వైయ‌స్ఆర్‌సీపీ, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఫిర్యాదు చేస్తామన్నారు.  
 
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. హెపటైటస్ కేసులు ఇన్ని వస్తున్నా ఇప్పటివరకు గ్యాస్ట్రోఎంట్రలిజిస్ట్‌ను కురుపాం ఆస్పత్రికికి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. అలాగే మిగతా హాస్టల్స్‌ విద్యార్థులకు వాక్సిన్‌ ఎందుకు వేయడం లేదని నిలదీశారు. గిరిజనుల వైద్యంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.

Back to Top