అభివృద్ధి ప‌నుల‌కు ఎమ్మెల్యే రోజా శంకుస్థాప‌న‌

చిత్తూరు:  న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని వడమాలపేట మండలం పూడి గ్రామంలో ప‌లు అభివృద్ధి కార్యక్ర‌మాల్లో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. రూ. 21 లక్షలతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రం, 
రూ. 17.50 లక్షలతో నిర్మించనున్న వెల్నెస్ సెంటర్ భవనం నిర్మాణాల‌కు ఎమ్మెల్యే రోజా భూమి పూజ చేశారు. అలాగే  సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ లకు కలిపి నిర్మించనున్న కాంపౌండ్ వాల్ నిర్మాణాల‌కు శంకుస్థాప‌న చేశారు.  సచివాలయం భవనంలో 2.00 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బోరు ను ఎమ్మెల్యే రోజా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.

Back to Top