కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయం
28 Feb 2020 12:57 PM
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు
శ్రీకాకుళం: విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను వ్యతిరేకించిన చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. అమరావతి పేరుతో కృత్రిమ ఉద్యమం చేపట్టి ప్రాంతీయ అసమానతలు పెంచేంది చంద్రబాబేనన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగుల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వైయస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మేలు జరిగేలా సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకుంటే దాన్ని చంద్రబాబు వ్యతిరేకించారన్నారు. అందువల్లే విశాఖ పర్యటనలో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైందన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని అడ్డుకుంటే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమన్నారు.