కార్యకర్తలే వైయ‌స్ఆర్‌సీపీ బ‌లం 

 మంత్రి ఉషాశ్రీచరణ్ 
 

అనంత‌పురం:  కార్య‌క‌ర్త‌లే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌ల‌మ‌ని మంత్రి ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ అన్నారు. మంగ‌ళ‌వారం అనంత‌పురం జిల్లా ప్లీన‌రీ న‌గ‌రంలోని శిల్పారామంలో నిర్వహించారు.  అనంతపురం జిల్లా స్ధాయి ప్లీనరీ సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు , ముఖ్య నేతలతో కలిసి దివంగత మహా నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ మాట్లాడారు. మ‌హిళా సాధికార‌త‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పెద్ద పీట వేశార‌ని తెలిపారు.

Back to Top