తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్రెడ్డి, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.