క‌ర్నూలులో ఘ‌నంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు 

క‌ర్నూలు: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా క‌ర్నూలు జిల్లా కలెక్టరేట్ లో అవతరణ దినోత్సవ వేడుకలు కలెక్టర్ పి.కోటేశ్వరావు  అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ముందుగా పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మేయర్ బి.వై రామయ్య , ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి , ఆర్థ‌ర్‌, హాఫీజ్ ఖాన్‌, సుధాక‌ర్,  జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ , జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ,  రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.  
వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా  కార్యాలయంలో.. 

వైయస్సార్ కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసిన కర్నూలు నగర మేయర్ బి.వై రామయ్య   ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్,  కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆర్థ‌ర్‌, సుధాకర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.  

Back to Top