బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు
వ్యవసాయం కలిసి రావడం లేదన్నా..
29 Nov 2017 10:46 AM
కర్నూలు: అన్నా..గత మూడు నాలుగేళ్ల నుంచి వ్యవసాయం కలిసి రావడం లేదు. పంట దిగుబడులు ఆటికాటికే. పోనీ మార్కెట్లో అయినా గిట్టుబాటు ధర వస్తోందా అంటే అదీ లేదు’ అని పలు గ్రామాలకు చెందిన అన్నదాతలు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తమ ఆక్రందన వినిపించారు. వైయస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర లో గుడేకల్కు చెందిన లింగన్న, ఎమ్మిగనూరుకు చెందిన సోమన్న, ఇతర రైతులు వైయస్ జగన్ను కలిశారు. పంటల సాగు సమయంలో వర్షాభావం, తెగుళ్లు తదితర ప్రకృతి వైపరీత్యాలతో కంది, శనగ, పత్తి సాగులో దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. దీనికి తోడు మార్కెట్లో గిట్టుబాటు ధర పడిపోవడంతో రైతులంతా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ తెలుగుదేశం హయాంలో వ్యవసాయం కలిసి రావడం లేదని, దీనికి తోడు ప్రభుత్వం అన్నదాతలను విస్మరిస్తోందని వాపోయారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రైతులకు అన్ని విధాల న్యాయం చేస్తామని వైయస్ జగన్భరోసా ఇచ్చారు.