విశాఖః మద్ది గ్రామానికి చెందిన పాపమ్మ అనే మహిళ పాదయాత్రలో వైయస్ జగన్ను కలిసింది. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో తమకు ఎంతో మేలు జరిగిందన్నారు. గతంలో తమ గ్రామానికి వచ్చిన వైయస్ఆర్తో కలిసి డాక్వ్రా మహిళలంతా కలిసి భోజనం చేశామని గుర్తుచేసుకున్నారు. తమకు మంచిరోజులు రావాలంటే వైయస్ జగన్ అధికారంలోకి రావాలన్నారు.