పులివెందుల: ‘‘నా పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం.. ప్రతీ నా ప్రతి కష్టంలో నా వెంట నిలిచిన ప్రతీ ఒక్కరికీ మీ జగన్, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాడు. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం మహానేత వైయస్ఆర్, ఆయన బిడ్డగా వైయస్ఆర్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మీ బిడ్డ జగన్ ప్రభుత్వం. పులివెందులలో ఏం ఉంది? అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు? అనే స్థాయికి చేరుకున్నాం. అందుకే పులివెందుల ఒక విజయగాథ. మంచి చేయడం మన కల్చర్.. మంచి మనసు మన కల్చర్.. మాట తప్పకపోవడం మన కల్చర్.. బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్’’ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. భాకారపురం సీఎస్ఐ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ పులివెందుల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం వైయస్ జగన్ పూర్తి ప్రసంగం.. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది నీళ్లు ఈరోజు పులివెందులలో కనిపిస్తూ, అభివృద్ధి బాటలో పరిగెడుతుందంటే.. ఈ అభివృద్ధికి, ఈ మార్పులకు మూలం, నా తండ్రి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అయితే, ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్ మరో రెండు అడుగులు వేసింది ఈ 58 నెలల కాలంలోనే అని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను. పులివెందులలో ఏముందని ఒకప్పుడు అడిగితతే.. పులివెందులలో ఏమిలేదో చెప్పండి అని తిరిగి అడిగే స్థాయికి పులివెందుల పట్టణాన్ని, నియోజకవర్గాన్ని మార్చుకుంటూ ప్రతి అడుగూ వేశాం. రాబోయే రోజుల్లో ప్రతి అడుగూ వేస్తాం కూడా. మన పులివెందుల, నా పులివెందుల, మనందరి పులివెందుల.. మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని, మాట ఇస్తే మడమ తిప్పరనే నమ్మకాన్ని, మోసం చేయరన్న విశ్వాసాన్ని మన తెలుగు నేల మీద అణువణువునా నింపింది మీ పులివెందుల బిడ్డేనని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను. కాబట్టే మన ప్రత్యర్థులు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదం.. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనమీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తున్నారు. మంచి చేయడం మన కల్చర్.. మంచి మనసు మన కల్చర్.. మాట తప్పకపోవడం మన కల్చర్.. బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్. పులివెందులను తెలుగు సీమ అభిమానించింది, నమ్మింది, కలసి నడిచింది. ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ మన పులివెందుల, మన కడప, మన రాయలసీమ మంచితనం, మాటకు నిలబడే గుండె ధైర్యం అర్థమయ్యింది కాబట్టే, ఓ వైయస్ఆర్, ఓ జగన్ను ప్రతి మారుమూల గ్రామంలో కూడా అభిమానించేవాళ్లు కోట్ల మంది కనిపిస్తున్నారు. ఓ వైయస్ఆర్, ఓ జగన్ మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి ఓ బాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ–5, ఓ దత్తపుత్రుడు, ఓ వదినమ్మ వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారో మీరే చేస్తున్నారు. వీరికి తోడు ఈ మధ్యకాలంలో కొత్తగా వైయస్ఆర్ వారసులం అని మీ ముందుకు వస్తున్నారు వారి కుట్రలో భాగంగా.. ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు..? ప్రజలు కాదా.. ఆ వైయస్ఆర్ను ప్రేమించేవారు కదా అని అడుగుతున్నా.. ఒక్క విషయం ప్రతి ఒక్కరినీ ఆలోచన చేయాలని కోరుతున్నా.. నాన్నగారి మీద కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తరువాత ఆయనపై కేసులు పెట్టింది ఎవరు..? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు..? ఆయన పేరును చివరకు సీబీఐ చార్జ్షీట్లోనూ పెట్టింది ఎవరు..? వైయస్ఆర్ లెగసీని ఉండకుండా చేయాలని చూస్తుంది ఎవరు..? వైయస్ఆర్ కుటుంబాన్ని పూర్తిగా అణగదొక్కాలని, లేకుండా చేయాలని కుట్రలు పన్నింది ఎవరు..? ఇవన్నీ పులివెందుల ప్రజలకు తెలుసు. వైయస్ఆర్ జిల్లా ప్రజలకు తెలుసు. తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సంగతులన్నీ తెలుసు. రాజకీయంగా అణగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించిన వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్, అదే టీడీపీతో కలిసిపోయి వైయస్ అనే పేరే కనబడకుండా చేయాలని కోరుకుంటున్న వారందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ, ఆ కుట్రలను అమలు చేస్తున్న మన శత్రువులతో చేతులు కలిపి, వారి పార్టీలో చేరిపోయిన వీరా వైయస్ఆర్ వారసులు..? ప్రజలంతా ఒక్కటి ఆలోచన చేయాలి.. వైయస్ఆర్ బతికి ఉన్నంతకాలం ఎవరితో పోరాటం చేశారని ఆలోచన చేయాలి. వైయస్ఆర్ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమాని, కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారో ఆలోచన చేయాలి. మరి ఆ వైయస్ఆర్ మీద కుట్రలు, కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని, వారి ఇళ్లకు వెళ్లి, వారికి మోకరిల్లి, వారి కుట్రలో భాగం అవుతూ, వారి స్క్రిప్టులను చదివి వినిపిస్తున్న వీళ్లా వైయస్ఆర్ అభిమానులు..? వైయస్ఆర్ కీర్తి ప్రతిష్టలను, ఆయన పేరును ప్రజల మనసు నుంచి చెరపేయాలని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైయస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ ఉండకూడదని, బహిరంగంగానే ఆ విగ్రహాలను ముక్కలు చెక్కలు చేస్తామని చెప్పిన వారితో చేతులు కలిపిన వీరా వైయస్ఆర్ వారసులు అని అడుగుతున్నా.. ఇలాంటి వారికి ఓటు వేస్తే వైయస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్టా..? లేక వైయస్ఆర్ పేరును కనబడకుండా చేసే కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్టా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ ఈ చెడిపోయి ఉన్న రాజకీయ వ్యవస్థను చూడమని, దిగజారిపోయిన రాజకీయ వ్యవస్థను గమనించమని కోరుతున్నా.. నిజంగా మీ బిడ్డను ఎదుర్కోలేకపోతున్నారు. మీ బిడ్డ జగన్ ఒక్కడు.. ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏమవుతున్నారు. ఒక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్.. వీరందరూ సరిపోరన్నట్టుగా నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేయిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు ఏ స్థాయికి పతనం అయిపోయాయో గమనించమని కోరుతున్నా.. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. కానీ, బురదజల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారి వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ రోజూ కనిపిస్తూనే ఉంది. వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా, బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నదెవరో మీరే రోజూ చూస్తున్నారు కదా.. చిన్నాన్నను అన్యాయంగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా ప్రలోభాలతో అధికార బలంలో ఓడించిన వారితోనే చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారంటే దానికి అర్థం ఏమిటని ప్రశ్నిస్తున్నా.. చిన్నాన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా, కాదా.. రెండో భార్యకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా, కాదా.. అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్లాడు.. వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూల్లో, ప్రెస్ కాన్ఫరెన్స్లో లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు మాట్లాడితే చాలు వెంటనే వారిపై కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ, కుట్ర రాజకీయాలు చేస్తుండడం ధర్మమేనా..? అని అడుగుతున్నా, ఆలోచన చేయమని కోరుతున్నా. చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా..? మరోపక్క కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్ని వచ్చాయి. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్తో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి, అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్లో చేరి వైయస్ఆర్ పేరును, ఆయన చనిపోయిన తరువాత చార్జ్షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి, మొత్తంగా వైయస్ఆర్ పేరును తుడిచివేయాలని, కనబడకుండా చేయాలని ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయడం అంటే దాని వల్ల ఎవరికి లాభం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలుస్తే కలిగే లాభం చంద్రబాబుకు, బీజేపీ కూటమికి కాదా అని అడుగుతున్నా.. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. ఇదంతా మన ఓట్లను విడగొట్టి వాళ్లను గెలిపించాలనే ప్రయత్నం కాదా..? అందరూ ఆలోచన చేయండి. అసలు ఎవరికి వైయస్ఆర్ మీద ప్రేమ ఉందో ప్రతి ఒక్కరూ గమనించమని, ఆలోచన చేయమని కోరుతున్నా.. పులివెందుల, కడప గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉందో ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుతున్నా.. ఓ వైయస్ఆర్ పేరు, ఓ పులివెందుల పేరు, ఓ వైయస్ఆర్ జిల్లా పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్నది ఎవరనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మరోపక్క ఈ పేర్లు లేకుండా చేయాలని ఆరాట పడుతున్న ఆ రెండు పార్టీతో జతకట్టి తన సొంత లాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తున్నారో గమనించాలని కోరుతున్నా. ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా వీరు వైయస్ఆర్ వారసులా, లేక ఆ చంద్రబాబుకు వారసులా అని మీరే ఆలోచన చేయండి అని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. పులివెందుల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా మరీ ముఖ్యంగా నా మీద ఆరోపణలు చేస్తున్న నా బంధువులకు కూడా ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నా.. ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు.. నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు.. ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలకు మంచి చేసేందుకు, మేలు చేసేందుకు దేవుడు ఈ అధికారాన్ని మీ బిడ్డ జగన్కు ఇచ్చాడు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మమ్మల్ని పక్కనబెట్టాడు అని మాట్లాడుతున్న నా బంధువులకు ఈ సందర్భంగా ఈ విషయం తెలియజేస్తున్నాను. వైయస్ అవినాష్ ఏ తప్పూ చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను అవినాష్కు టికెట్ఇచ్చాను. ఈ రోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమో ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుతున్నాను. మా అందరికంటే చాలా చిన్నోడు అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని పెద్దపెద్దవారంతా కుట్రల్లో భాగం అవుతున్నారంటే నిజంగా వీళ్లంతా మనుషులేనా అని అడుగుతున్నా. పులివెందులలో గానీ, కడపలో గానీ, మొత్తం తెలుగు నేల మీద ఒక జలయజ్ఞం అన్నా, ఉచిత విద్యుత్ అన్నా, 108 అన్నా, 104 అన్నా, ఆరోగ్యశ్రీ అన్నా, వీటన్నింటితో పాటు మీ బిడ్డ జగన్ పెట్టిన అమ్మ ఒడి అన్నా, గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడు స్కూల్స్, నాడు–నేడు ఆస్పత్రులు, చేయూత, వైయస్ఆర్ ఆసరా, 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లు, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, విలేజ్ క్లినిక్, వైయస్ఆర్ రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు, వలంటీర్ వ్యవస్థ అయినా ఎక్కడా ఒక్క రూపాయి లంచం లేకుండా వివక్ష లేకుండా జరుగుతున్న పాలన అయినా, ఏకంగా 2.70 లక్షల కోట్ల రూపాయలు డీబీటీగా అందించడం అయినా.. ఇవన్నీ మన మనసు, మన మానవత్వాన్ని చూపే అంశాలు, ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మలు చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఉంటుందా..? మీరే గమనించండి.. జగన్ను పథకాల్లో కొట్టలేరు, జగన్ను పాలనలో, పనితీరులో కొట్టలేరు, జగన్ను పల్లెకు చేసిన మంచిలో కొట్టలేరు, జగన్ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు, జగన్ను రైతులకు అందించిన రైతు భరోసాలో కొట్టలేరు, గ్రామంలో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల్లోనూ కొట్టలేరు, జగన్ను అక్కచెల్లెమ్మలకు చేసిన మంచిలో, మేలులో కొట్టలేరు, జగన్ను అవ్వాతాతల పట్ల చూపించిన అనురాగంలో కొట్టలేరు, వారి ఆత్మగౌరవాన్ని కాపాడటంలోనూ కొట్టలేరు, జగన్ను డీబీటీలో కొట్టలేరు.. ఏ రంగాన్ని తీసుకున్నా.. జగన్ మంచి చేయలేదని వీళ్లు చెప్పలేరు. జగన్ కంటే తమ 14 ఏళ్ల పాలనలో మంచి చేశామని వారు చెప్పలేరు. మరి బ్రాండ్ జగన్, మరి బ్రాండ్ వైయస్ఆర్, బ్రాండ్ కడప, బ్రాండ్ పులివెందులను కొట్టాలనుకుంటున్న వీళ్లందరికీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పడానికి మీరంతా సిద్ధమేనా.. పులివెందుల అభివృద్ధికి ఈ ఐదేళ్లలో ఏం చర్యలు తీసుకున్నామో నాలుగు మాటల్లో వివరిస్తా.. పులివెందుల ప్రజల చిరకాల కోరిక కనిపిస్తున్న ఆ మెడికల్ కాలేజ్. నాన్న కలలు కన్న ఆ మెడికల్ కాలేజ్, ఆయన బిడ్డగా పులివెందుల ప్రజలకు మొన్ననే మెడికల్ కాలేజీలోని ఆస్పత్రిని అంకితం చేశాం.. ఈ జూలై, ఆగస్టులో మెడికల్ కాలేజీని అంకితం చేయబోతున్నాం. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాన్ని ఏ విధంగా మారుస్తున్నామో మీ అందరికీ కనిపిస్తుంది. జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్లో భాగంగా 900 కోట్ల రూపాయలతో కాలేటి వాగు సామర్థ్యం పెంచి కరువు పీడిత చక్రాయిపేట మండలానికి నీటిని అందించే పనులు కూడా దాదాపు పూర్తికావొచ్చాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో గతంలో ఎప్పుడు కూడా 3, 4 టీఎంసీలకు మించి స్టోర్ చేయలేని పరిస్థితిని మారుస్తూ.. 2020లో ఆ గ్రామాలకు సంబంధించి ఆర్ ఎండ్ ఆర్ పరిహారం దాదాపు 250 కోట్ల రూపాయలు చెల్లించి, 2020 నుంచి క్రమం తప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 టీఎంసీల నీటిని నింపుతూనే వస్తున్నాం. రైతులకు మంచి జరిగిస్తూ పైడిపాలెం రిజర్వాయర్ను 6 టీఎంసీల పూర్తి కెపాసిటీతో నింపేలా చర్యలు తీసుకున్నాం. యురేనియం బాధిత గ్రామాలతో పాటు లింగాల, వేముల, వేంపల్లె మండలాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ఏకంగా రూ.1000 కోట్లతో ఎ్రరబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.480 కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని సప్లయ్ చేసే కార్యక్రమం దాదాపు పూర్తయింది. పులివెందులలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ క్యాంపస్ పూర్తి చేసి, ప్రారంభించుకున్నాం. ఏపీకార్లో న్యూటెక్ సైన్సెస్ పరిశ్రమతో పాటు వైయస్ఆర్ వ్యవసాయ కళాశాల, ఉద్యానవన కళాశాలను నెలకొల్పాం. ఆదిత్య బిర్లా గార్మెంట్ పరిశ్రమ పులివెందులకు తీసుకువచ్చాం. అనేక సార్లు కేంద్రంతో మాట్లాడి జాతీయ రహదారులు, గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులు ఈరోజు పులివెందులలో కనిపిస్తున్నాయి. పులివెందులలో కొత్త బస్టాండ్, క్రికెట్ స్టేడియం, పార్కులు మీరంతా చూస్తున్నారు. దాదాపుగా రూ.5,900 కోట్లతో ఈ 58 నెలల్లో నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కాకుండా ఇంటింటికీ మీ బిడ్డ జగన్ బటన్ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోవడం. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము అక్షరాల మరో రూ.2,069 కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. పులివెందులలో నవరత్నాల పథకాల లబ్ధిని అందుకున్న గడపలు.. ఏకంగా 94.04 శాతం. చీని అమ్మకాలకు పులివెందుల నుంచి అనంతపురం వెళ్లాల్సిన గత పరిస్థితులు మార్చి పులివెందులలోనే అమ్మే ఏర్పాట్లు చేశాం. ఇవన్నీ చేశాం అంటే మీ బిడ్డ జగన్ సీఎం అయ్యాడు కాబట్టే.. నాన్నగారి మరణం తరువాత 10 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వాలైనా మన పులివెందులను పట్టించుకున్నారా..? పులివెందుల దశ మీ బిడ్డ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాతే కదా.. ఇంకా పులివెందులను, వైయస్ఆర్ జిల్లాను అభివృద్ధి చేయాలి, మరింత అభివృద్ధి చెందబోతున్నాయి మన ప్రాంతాలు. వచ్చే ఐదేళ్లలో మీ అండతో, ఆ దేవుడి ఆశీస్సులతో మీ బిడ్డ ద్వారా జరగబోతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. పులివెందుల, కడప, రాయలసీమ, వైయస్ఆర్, వైయస్ జగన్ ఇవన్నీ మనసున్న మన పేర్లు. ఈ పేర్లను చెరిపేయాలనుకునేవారు ఎన్నటికీ మనకు, మన రాష్ట్రానికి వ్యతిరేకులేనని గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయడం ద్వారా మరో ఐదేళ్ల ప్రయాణాన్ని, ఇంటింటి ప్రయాణానికి, పులివెందుల ప్రయాణానికి, మీ జగన్ ప్రయాణానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ.. మీ బిడ్డకు చరిత్రలో కనీవిని ఎరుగని మెజార్టీ ఇచ్చిన ఈ గడ్డను మరోసారి అలాంటి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అవినాష్ను కూడా అంతే ఆప్యాయతతో, గొప్ప మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.