తాడేపల్లి: ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన వైయస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైయస్ఆర్సీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన యువత పోరు కార్యక్రమంలో యువత, విద్యార్థులు కదం తొక్కారు. మాట తప్పి.. వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లా కలెక్టరేట్ల వద్ద వైయస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు యువతీయువకులతో కలిసి వైయస్ఆర్సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించారు. ధర్నాచౌక్లో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు నిరసన కార్యక్రమం చేపట్టారు. విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడ నగరంలో యువత, విద్యార్థులు, వైయస్ఆర్సీపీ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంకు నిరసన ప్రదర్శన చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిపెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన,విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన బకాయిలు, మెడికల్ కాలేజ్లు ప్రైవేటీకరణ పై నిరుద్యోగ యువతకు రూ. 3,000 భృతి చెల్లించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. ధర్నాలో ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వైయస్ఆర్సీపీ ఎంప్లాయిస్ & పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్మోహన్ రావు, జగ్గయ్యపేట వైయస్ఆర్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ దొడ్డా అంజిరెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్లు, యువత పాల్గొన్నారు. మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్.. ఇంటింటికీ తిరిగి మోసపు వాగ్ధానాలిచ్చి చంద్రబాబు గద్దెనెక్కారు ఏడాది కాలంలో కేవలం పెన్షన్లు మాత్రమే ఇచ్చారు విద్యకు ప్రాధాన్యం కల్పించిన నాయకులు వైయస్ జగన్. చిన్నపిల్లలను కూడా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసింది తల్లికి వందనం 15 వేలు ఇస్తామని చెప్పిన లోకేష్ 13 వేలు ఇచ్చి మోసం చేస్తున్నాడు వైఎస్ జగన్ బయటికి వెళితే భద్రత లేదు ఆయనపై కేసులు ఎలా పెట్టాలి.. జైల్లో ఎలా పెట్టాలనేదే కూటమి ఆలోచన సత్తెనపల్లి పర్యటనలో దొంగ సాక్ష్యాలతో జగన్పై కేసు పెట్టాలని చూస్తున్నారు ఏం చేశారని సుపరిపాలన జరుపుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి విజయవాడలో ధర్నా చౌక్ ఖాళీ ఉండటం లేదు లోకేష్ పేరుకే విద్యాశాఖ మంత్రి ఆయన శాఖ తప్ప అన్ని శాఖల పనులూ లోకేష్ చేస్తున్నాడు విద్యార్ధుల ఆవేదనను ఇప్పటికైనా లోకేష్ గుర్తించాలి ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ ఇంఛార్జి దేవినేని అవినాష్ కామెంట్స్.. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసింది యువకుల బాధ్యత నాది అని యువగళంలో లోకేష్ హామీ ఇచ్చాడు ఈరోజు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు నేనుంటాను.. నేను చూసుకుంటానని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు సచివాలయ వ్యవస్థ ప్రజలకు దూరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తో కాలక్షేపం చేస్తున్నారు సత్తెనపల్లి పర్యటనలో ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్ కారణం కాదని ఎస్పీ చెప్పారు ఫేక్ వీడియో జతచేసి రాజకీయం చేస్తున్నారు.. పట్టించుకోలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు గతంలో టీడీపీ నేతలు చేసిందేంటి? కందుకూరు సభ పెట్టి ఎనిమిది మందిని బలి తీసుకున్నారు గుంటూరులో చీరలు పంచి ముగ్గురు చనిపోయేలా చేశారు ప్రజల ప్రాణాలు పోతే వదిలేసి వచ్చిన చరిత్ర మీది తారకరత్న చనిపోతే యువగళాన్ని కొనసాగించిన వ్యక్తి లోకేష్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్.. యువతను ఈ ప్రభుత్వం మోసం చేసింది ప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు.. మెగా డీఎస్సీ అన్నారు హామీలపై చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలి వైఎస్ జగన్ తెచ్చిన కంపెనీలకు మళ్లీ కొబ్బరికాయలు కొట్టడమేనా మీ అభివృద్ధి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇంతవరకూ చెల్లించలేదు నిన్నటి వరకూ వైయస్ జగన్ చుట్టూ ఉన్నవారిపై కేసులు పెట్టారు ఇప్పుడు ఆయనతో పాటు కారులో ఉన్నవారిపైనా కేసులు పెడుతున్నారు సినిమా డైలాగ్ ను చెబితే వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేశారు నీ తల నరకొచ్చుగా అన్న బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు ఎవరైనా ఖండించారా?. బుచ్చయ్య చౌదరి పై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయనను ప్రజల్లోకి వెళ్లకుండా ఆపాలని చూస్తున్నారు ఎన్ని నిర్భందాలు విధించినా మేం ప్రజల పక్షాన నిలబడతాం.. ప్రశ్నిస్తాం దాడిశెట్టి రాజా కామెంట్స్.. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ప్రజలు, రైతులు, యువత, మహిళల తరపున ప్రశ్నించే ఏకైక నాయకుడు వైయస్ జగన్ వైయస్ జగన్ను ఏదో విధంగా ఎలిమినేట్ చేయ్యాలనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకుల మాటలు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళకూడదు.. ప్రజల తరుపున ప్రశ్నించకూడదని అనుకుంటున్నారు. బుచ్చయ చౌదరికి ఇంగిత జ్ఞానం.. బుద్ది లేదా? 80 ఏళ్ళ వయస్సులో ఒక మాజీ ముఖ్యమంత్రి తల నరుకుతానంటున్నావ్! ప్రజలను ఏవిధంగా మోసం చేశారో వైఎస్ జగన్ చెబితే... దానికి సమాధానం చెప్పకుండా రప్పా రప్పా అంటూ డైవర్ట్ చేశారు. వైయస్ జగన్ ప్రెస్మీట్ డైవర్ట్ కోసం రప్పా..రప్పా ఫీజు రియింబర్స్మెంట్ రప్పా..రప్పా నిరుద్యోగ భృతి రప్పా..రప్పా. కృష్ణాజిల్లా: మచిలీపట్నం ధర్నా చౌక్ వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమంలో జిల్లా లోని నియోజకవర్గాల వారీగా యువత పాల్గొన్నారు. విద్యార్థులను చంద్రబాబు మోసం చేశాడని పేర్ని కిట్టు మండిపడ్డారు. విద్యార్థులను చంద్రబాబు మోసం చేశాడు ఎన్నికల సమయంలో నోటి కొచ్చిన హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చాక భయం వేస్తుందని మాట మార్చాడు పవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకొని యువతను మోసం చేయాలని చూశావు ప్రస్తుతం యువత అంత పిచ్చితనంలో లేరు యువత మిమ్మల్ని నిలదీసే రోజు వచ్చింది. విద్యార్ధులకు ఫీజులు ఎగ్గొట్టిన ఏకైక ముఖ్యమంత్రివి నువ్వే చంద్రబాబు విశాఖపట్నంలో యోగ పేరిట డబ్బు ఖర్చు పెట్టావ్ ఆ డబ్బులను యువత ఫీజులకి విడుదల చేసుంటే బాగుండేది గిన్నిస్ రికార్డు కోసం యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులకు ఫీజులు ఎగ్గొటిన ఏకైక ముఖ్యమంత్రి నేనే అని గిన్నిస్ రికార్డులో ఎక్కాల్సింది విశాఖలో ఉద్రికత్త.. విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు వైయస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. అయితే యువత పోరుబాట ధర్నాను కలెక్టరేట్ వద్దకు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. నాలుగు చోట్ల భారీకేట్లు పెట్టిన పోలీసులు.. వైయస్ఆర్సీపీ శ్రేణులను నియంత్రించ లేకపోయినా పోలీసులు.. పోలీసులకు వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట. పోలీసులను దాటుకొని కలెక్టరేట్కు వచ్చిన వైయస్ఆర్సీపీ కార్యకర్తలు.. చంద్రబాబు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు.. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు.. ఏడాదికాలంగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.. నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.. ఇంటికొక ఉద్యోగం అన్నారు.. ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలి. నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాలి.. విశాఖ వైయస్ఆర్సీపీ పార్లమెంటు పరిశీలకుడు కదిరి బాబురావు. వైయస్ఆర్ జిల్లా.. వైయస్ఆర్సీపీ పిలుపు మేరకు కడపలో భారీ ర్యాలీ వైయస్ఆర్సీపీ యువజన విభాగం ర్యాలీని ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొన్న యువత కూటమి ప్రభుత్వం అన్ని విధాలా యువతను మోసం చేసిందని నినాదాలు కలెక్టర్ కార్యాలయంలో యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వినతిపత్రం అనంతపురం.. యువత సమస్యలపై వైయస్ఆర్సీపీ పోరుబాట అనంతపురం కలెక్టరేట్ వద్ద యువత పోరు భారీగా తరలివచ్చిన యువకులు, విద్యార్థులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదంటూ ఆగ్రహం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశారు ఒక్కో నిరుద్యోగికి మూడు వేల రూపాయల భృతి ఇస్తామన్న హామీ ఏమైంది ఒక్క ఏడాదిలో నిరుద్యోగ భృతి బకాయిలు 7200 కోట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ యువత సమస్యలు పట్టవా అని ప్రశ్నలు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్.. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారు రెడ్బుక్పై ఉన్న శ్రద్ధ.. హామీల అమలులో లేదా? కర్నూలు నుంచి పారిపోయి వచ్చిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బెదిరించటం హాస్యాస్పదం టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు తనపై వ్యతిరేక వార్తలు రాసే వారిని రైలు పట్టాలపై పడుకోబెడతానన్న గుమ్మనూరు జయరాంపై ఏ చర్యలు తీసుకోలేదు చంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాలి. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కామెంట్స్.. సింగయ్య మరణంతో వైఎస్ జగన్కు ఏం సంబంధం? వైఎస్ జగన్ వాహనం కింద పడి కార్యకర్త చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు వైయస్ఆర్సీపీ యువత పోరు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు కుట్రలు హామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలం అయ్యారు. హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలని చెప్పారు చంద్రబాబు కాలర్ పట్టుకోవాలా? పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకోవాలా? నారా లోకేష్ కాలర్ పట్టుకోవాలా? ఏడాది పాలనలోనే చంద్రబాబు ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్నారు. కర్నూలు జిల్లా : నిరుద్యోగులకు ఎన్నికల లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి సంవత్సరం అవుతున్న ఇవ్వకపోవడాని నిరసిస్తూ వైయస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహించారు. యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేతలు డిమాండ్ చేశారు. నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి వాగ్దానం చేసింది. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి, ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన చేసారు కాని అమలు చెయ్యలేదు . ఏడాది పూర్తయినా హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం. 2025-26 బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతికి పైసా కేటాయించని సర్కార్. 2014 ఎన్నికల్లోనూ యువతను ఇదే రీతిలో వంచించిన చంద్రబాబు. నమ్మించి నట్టేట ముంచిన సీఎం చంద్రబాబుపై యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలు డీఆర్వోకు కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఎద్దుల శివా రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ ప్రతుల్, రాష్ట్ర, జిల్లా యువజన విభాగం నాయకులు చంద్రశేఖర్, ప్రశాంత్ , ధరణి, దుర్గ, అశోక్, సాయి, నజీర్ తదితరులు వినతిపత్రం అందజేశారు. తిరుపతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి యువకులు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. అయితే యువత పోరు కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షులు నల్లతిమ్మయపల్లి సర్పంచ్ గీతాల నరసింహ రెడ్డి, వాలంటీర్స్ విభాగం నియోజకవర్గం అధ్యక్షులు టి.వి పురం సర్పంచ్ భాస్కర్ యాదవ్, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గుణ యాదవ్, యూత్ లీడర్ ఆనాల మధు యాదవ్, ఆడపూరు రవిరాజు, అఖిల్, భరత్ మరియు నాయకులు వివిధ విభాగల కన్వీనర్ లు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా: యువత సమస్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యార్థి సంఘ నాయకులు, పెద్దఎత్తున పాల్గొన్న యువత విద్యార్థులకు, యువతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరుద్యోగ బృతి, జాబ్ క్యాలెండర్, వసతి దీవెన లో విద్యార్థులను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సర్కార్ యువత పోరు పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర యువజన విభాగం నాయకులు జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలో జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద నుండి యువత, విద్యార్థులు వైయస్ఆర్సీపీ నాయకులతో విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మద్దతుగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిపెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన,విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన బకాయిలు,మెడికల్ కాలేజ్ లు ప్రైవేటీకరణ పై నిరుద్యోగ యువతకు రూ. 3,000 భృతి చెల్లించాలని వినతి పత్రం ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా చంద్రబాబు మోసం చేశారని జిల్లా యువజన విభాగం, స్టూడెంట్ విభాగం అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు అబద్ధపు హామీలను నిలదీస్తూ వీరు ఘాటుగా స్పందించారు. అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన యువతను ఉద్దేశిస్తూ... నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఏవి? ఉపాధి ఎక్కడ? ప్రభుత్వంలోకి వచ్చి వెంటనే తన కొడుక్కి మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు, ఈ రాష్ట్ర యువతను గాలికి వదిలేశాడు” అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి ఏది? సంవత్సరం గడిచినా మీరు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఎక్కడ చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ఎన్నికలు ముందు అమలుకాని హామీలు ఇవ్వటం ఎన్నికలు అయ్యాక గాలికి వదిలేయటం చంద్రబాబుకి పరిపాటి అని విమర్శించారు. ఇదే స్పూర్తితో యువత ఉద్యమం కొనసాగుతుంది అని,యువత హక్కుల సాధన కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం పోరాటాన్ని మరింత ఉధృతం చేయనుంది అని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్, స్టూడెంట్ విభాగం అధ్యక్షులు కరుమజ్జి సాయి కుమార్, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కౌశిక్, చీపురుపల్లి నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీ కృష్ణ,జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంత్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పతివాడ సత్యనారాయణ, రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు,జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా సోషల్ మీడియా కార్యవర్గ సభ్యులు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల అనుబంధ విభాగాలు అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు,ముఖ్య నాయకులు ,సీనియర్ నాయకులు ఇతర ప్రజా ప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వైయస్ఆర్సీపీ పిలుపు మేరకు సోమవారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యం 250 ద్విచక్ర వాహనాలపై నరసన్నపేట నియోజకవర్గ యువకులు, నాయకులు వెళ్లారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : యువత పోరుబాట కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణంలోనిజిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్న వైయస్ఆర్సీపీ నేతలను కార్యకర్తలను యువకులను పోలీసులను అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట... వాగ్వివాదం జరిగింది. ఏలూరు జిల్లా: వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలపై యువజన విభాగం ఆధ్వర్యంలో "యువత పోరు`` నిర్వహించారు. ఏలూరు కేంద్రంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా , రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, పార్టీ నాయకులు యువత పోరులో పాల్గొని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, జిల్లా పరిశీలకులు వంకా రవీంద్రనాథ్, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయ ప్రకాష్, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరి సునీల్ కుమార్, , జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా : కూటమి ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగ భృతి చెల్లించడంతో పాటు 20లక్షల ఉద్యోగాలు కలించాలి అని నినదిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా మేనిఫేస్ట్ లో చెప్పిన ప్రకారం నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 నిరుద్యోగ భృతితో పాటు ఇస్తామన్న 20లక్షల ఉద్యోగాలు ఇవ్వక పొగా, అటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా పోయిన కూటమి ప్రభుత్వం నీ నిలదీస్తూ జిల్లా వైయస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్రంలో గల వైయస్ఆర్ విగ్రహం వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా యువత పోరు నిరసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు అధికారులకు వినతిపత్రం అందచేసి నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు న్యాయం చేయాలని వైసిపి యువజన విభాగం తరుపున కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు నగిరెడ్డి శరత్ బాబు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర విభాగం కార్యదర్శులు, నియోజకవర్గాల యువజన విభాగం అధ్యక్షులు, మండలాల యువజన అధ్యక్షులు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.