తాడేపల్లి: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణి ఆధ్వర్యంలోనే లిక్కర్ డీల్స్ జరిగాయని వైయస్ఆర్సీపీ మహిళా మంత్రులు, ప్రజా ప్రతినిధులు విరుచుకుపడ్డారు. లిక్కర్కు బాబు కుటుంబానికీ అవినాభావ సంబంధం ఉందన్నారు. కనిపించేది పాల వ్యాపారం... తెర వెనక లిక్కర్ బేరం అంటూ ధ్వజమెత్తారు. అత్తాకోడళ్ళు... ఇద్దరికీ ఇదే పని అని విమర్శించారు. మద్యం లైసెన్సులు ఇప్పించటం ఈ ఇద్దరికీ కాటేజ్ ఇండస్ట్రీ అన్నారు. చంద్ర బాబు హయాంలోనే డిస్టిలరీలు, బ్రూవరీలన్నింటికీ లైసెస్సులు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి మంత్రి కే వీ ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పోతుల సునీత, ఎస్సీ(మాల) కార్పొరేషన్ చైర్ పర్సన్ పి. అమ్మాజీ మీడియాతో మాట్లాడారు.
ఆ నలుగురు ఏమన్నారంటే...*
*– లిక్కర్కు బాబు కుటుంబానికీ అవినాభావ సంబంధం.*
*– కనిపించేది పాల వ్యాపారం... తెర వెనక లిక్కర్ బేరం.*
*– అత్తాకోడళ్ళు... ఇద్దరికీ ఇదే పని.*
*– మద్యం లైసెన్సులు ఇప్పించటం ఈ ఇద్దరికీ కాటేజ్ ఇండస్ట్రీ.*
*– బాబు హయాంలోనే డిస్టిలరీలు, బ్రూవరీలన్నింటికీ లైసెస్సులు*
*– అన్నీ తమ పార్టీవారికే ఇచ్చుకున్న వైనంలో పుచ్చుకున్నది ఎంత?*
*– ఈ అంశంపై న్యాయ విచారణ జరగాలి.*
*– మద్యం తయారీ అనుమతులు ఇప్పించటం వారిద్దరికీ దశాబ్దాలుగా కుటీర పరిశ్రమ.*
*– స్వయంగా మద్యం సేవించటంలో అత్తా కోడళ్ళ మధ్య పోటాపోటీ*
*– ఇలా తాగే ఈ మధ్య కొట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.*
*– టోటల్గా బాబు కుటుంబమే తాగుబోతు ఫ్యామిలీ*
*– ఒక వంక మగువ, మరో వంక మద్యం... ఇదే పప్పు బ్రాండ్.*
*– అయినా ఇంట్లో అన్నింటికీ లైసెన్స్! ఇది తమకు కామనే అన్నట్టు యవ్వారం.*
*– చుక్క లేకపోతే అయ్యా కొడుకులు ఒక్క ముక్క కూడా మాట్లాడలేరు.*
*బీ-3 బ్రాండ్లు!*
రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్లు అన్నీ ‘బీ–3’ బ్రాండ్లు! అంటే భువనేశ్వరి, బ్రహ్మణి, బాబు బ్రాండ్లు!
– బాబు హయాంలోనే బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ ఛాయిస్. పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజండ్, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హేంగర్... ఇలా 254 బ్రాండ్లకు అనుమతులు.
– బ్రాండ్ల పేరు పెట్టుకుని దత్త పుత్రుడి రుణం, వియ్యంకుడి రుణం కూడా తీర్చుకున్నారు.
– మద్యం కంపెనీలన్నీ టీడీపీ వారివే.
– ఎస్పీవై బ్రాండ్ ఎవరిది? ఎస్పీవై రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన టీడీపీ నాయకుడు కాదా?
– ఇంకా విశాఖ డిస్టిల్లరీ గురించి చూస్తే.. 2019, ఫిబ్రవరి 25న దానికి అనుమతి ఇచ్చారు. అది టీడీపీకే చెందిన అయ్యన్నపాత్రుడికి చెందిన కంపెనీ. దాన్ని గత ఏడాది అమ్మేశానని అయ్యన్నపాత్రుడు చెప్పారు. అంటే ఏడాది క్రితం వరకు అది అయ్యన్నపాత్రుడిదే కదా? ఎన్నికల ముందు అనుమతి ఇచ్చారా? లేదా?
– అలాగే పీఎంకే డిస్టిల్లరీ యనమల రామకృష్ణుడి వియ్యంకుడిది కాదా?
– శ్రీ కృష్ణా డిస్టిల్లరీ ఆదికేశవులునాయుడిది కాదా?
– ఆ అనుమతుల్ని మనందరి ప్రభుత్వం రద్దు చేసి, కొత్త లైసెన్సులు ఇచ్చి ఉంటే... వారు విమర్శించినా అర్థం ఉంటుంది. లైసెన్సులు ఇచ్చినది బాబు, బ్రాండ్లకు అనుమతి ఇచ్చినది బాబు హయాంలో... లిక్కర్ సేల్స్ ఆకాశానికి పెంచినది బాబు.
– ఈ అనుమతులన్నీ బీ–3 వల్లే వచ్చాయి. టీడీపీ వారు ఈ అనుమతులకు, నడుపుకుంటున్నందుకు లంచాలు ఎవరికి ఇస్తారు?
*మా హయాంలో మద్యం వినియోగం తగ్గింది*
లిక్కర్ సేల్స్ పెంచితే కమిషన్లు వస్తాయిగానీ, బెల్ట్ షాపుల్ని రద్దు చేసి, బార్ లైసెన్సుల్ని 33 శాతం తగ్గించి, పర్మిట్ రూముల్ని మూయించి... ప్రభుత్వ హయాంలోనే లిక్కర్ అమ్ముతున్న సమయంలో... ఏకంగా మద్యం సేల్స్ తగ్గిపోయిన పరిస్థితుల్లో... సేల్స్ తగ్గిస్తే ఎవరైనా కమిషన్లు ఇస్తారా? రాష్ట్రంలో మద్యం వినియోగం ఎంతగా తగ్గిందో అందరికీ తెలుసు. 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.31 లక్షల కేసులు ఉంటే... 2021–22లో ఏకంగా 278.5 లక్షల కేసులకు తగ్గాయి.
– 2018–19లో బీరు అమ్మకాలు 277.10 లక్షల కేసులు కాగా, 2021–22లో గణనీయంగా 82.6 లక్షల కేసులకు తగ్గింది.
– 2018–19లో మద్యం విక్రయాల మీద ఆదాయం రూ.20,128 కోట్లు కాగా... 2021–22లో ఆదాయం రూ. 25,023 కోట్లు అయ్యింది.
– అంతే కాకుండా...
– 43 వేలకు పైగా బెల్టుషాపులను రద్దు చేశాం. 4380 వైన్ షాపులుంటే, ప్రతి షాప్కు పర్మిట్ రూమ్లు అనుమతి ఇచ్చారు. దాని వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితుల తలెత్తడంతో.. ఆ పర్మిట్ రూమ్లన్నీ రద్దు చేశాం. అంతే కాకుండా 4380 నుంచి 2934కు వైన్షాప్లు తగ్గించాం.
– అంతే కాకుండా ప్రై వేటు వ్యక్తుల చేతుల్లో షాపులు ఉంటే విచ్చలవిడిగా అమ్ముతారు. బెల్టుషాపులు ఏర్పాటు చేస్తారు కాబట్టి, ప్రభుత్వమే స్వయంగా మద్యం అమ్మకాలు చేపట్టింది. దీంతో నిర్ణీత వేళల్లోనే మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి.
– ఈ చర్యల వల్ల బెల్టు షాపులు లేకుండా పోయాయి. అంతే కాకుండా ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం విక్రయిస్తున్నాం.ఈ విధంగా ఒక చిత్తశుద్ధితో మద్యం అమ్మకాలు తగ్గించే చర్యలు చేపట్టాము. నియంత్రణతో మద్యం అందుబాటులోకి తెచ్చాం.
– అంతే కాకుండా నాటు సారా తయారీ, అమ్మకాలపై గట్టి నిఘా వ్యవస్థనే పెట్టాం. ఎస్ఈబీ ఏర్పాటు చేసి ఎక్కడిక్కడ దాడులు చేస్తున్నాం. కఠినంగా వ్యవహరిస్తున్నాం.
– నిజానికి 2014–19 మధ్యే లిక్కర్ సేల్స్ ఆకాశానికి అంటాయి.
*లిక్కర్ తయారీదార్లు, డిస్టిలరీ ఓనర్లు పచ్చబాబులే.*
భవిష్యత్తులో ఏర్పడబోయే మద్యం డిమాండ్కు అనుగుణంగా... అంటూ బాబు హయాంలోనే లైసెన్స్లు ఇచ్చారు... అదీ దిగిపోయే ముందు!
– లిక్కర్ తయారీదార్లు, డిస్టిలరీ ఓనర్లు పచ్చబాబులే.
– 2019 తర్వాత అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిస్టలరీకి కానీ, ఒక్క బ్రీవరీకి కానీ మనందరి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందే లేదు.
– రాష్ట్రంలో 20 డిస్టలరీలు ఉన్నాయి. ఈ 20 డిస్టలరీలకు అనుమతులు ఎప్పుడు వచ్చాయో గమనిస్తే.. ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి.
– రాష్ట్రంలో లిక్కర్ తయారు చేసే ఈ 20 డిస్టలరీలు ఉంటే... 1982 కు మందు ఉన్నవి కేవలం 5 మాత్రమే. 1982 తర్వాతనే మిగిలినవన్నీ రావడం జరిగింది. యాజమాన్యం మారిన రెండు కంపెనీలతో కూడా కలుపుకుని చంద్రబాబు గారి హయాంలో ఇచ్చినవి అక్షరాలా 14. ఇరవైలో 14 చంద్రబాబు గారి హయాంలో ఇచ్చినవే.
– ఇందులో 2014 నుంచి 2019 మధ్యలో ఈ పెద్దమనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 7 డిస్టలరీలకు అనుమతి ఇచ్చాడు.
– 5 ఏళ్లలో 254 బ్రాండ్లు, 7 డిస్టిల్లరీలకు అనుమతి ఇచ్చి, లిక్కర్ విక్రయాలను ప్రమోట్ చేశారు.
– మనందరి ప్రభుత్వం16 కొత్త మెడికల్ కాలేజీలు, 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే... ఈయనగారి హయంలో 14 డిస్టలరీలకు అనుమతి ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే... అంతా సొంత ‘హోం మినిస్టర్’ మాయ!
– అందుకే వీరి ఇంటి పేరు నారా బదులు సారా అంటే కరెక్టుగా సూటవుతుంది.
*ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి మళ్ళీ దండలేసే రకం బాబు*
మామను ఇదే బాబు తానే వెన్నుపోటు పొడుస్తాడు, ఆయన చావుకి తానే కారణమవుతాడు, మళ్లీ అదే ఎన్టీఆర్ విగ్రహానికి ఎన్నికలు వచ్చినప్పుడు దండ వేస్తాడు. ఇవన్నీ మనం ప్రతిసారీ గమనిస్తూ ఉంటాం. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రేడ్ మార్క్. అదే విధంగా ఇక్కడ తానే బ్రాండ్లకు, డిస్టలరీలకు అనుమతులు ఇస్తాడు. వాళ్ల డిస్టిల్లరీలలో ఈ బ్రాండ్స్ తయారవుతుంటాయి. మళ్లీ తానే వచ్చి ఆ బ్రాండ్స్ గురించి ప్రెస్మీట్ పెట్టి ఎక్కడా లేని బ్రాండ్స్ అంటూ.. ఇవెక్కడి పేర్లు, ఇవెక్కడి బ్రాండ్స్ అంటూ తానే ఈ మాటలు మాట్లాడుతూ ప్రెస్మీట్స్ పెడతాడు.
*అన్ని దోపిడీలకు సమాధానం బీ-3 కుంభకోణాలే..*
అంతే కాకుండా... ఇసుక అమ్మకాల్లో అయిదేళ్ళలోనే రూ. రూ. 4000 కోట్లు వస్తుంటే... గత ప్రభుత్వంలో ఈ డబ్బంతా ఏమయిందన్న ప్రశ్నకు సమాధానం... బీ–3 కుంభకోణం!
– మైనింగ్ దోపిడీ ఎలా జరిగిందన్న ప్రశ్నకు సమాధానం... బీ–3 కుంభకోణాలు!
– దోచుకో పంచుకో తినుకో(డి.పి.టి.) అన్నదే టీడీపీ వ్యూహం. ఇందులో దుష్ట చతుష్టయంలోని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్త పుత్రుడికి ఎప్పటికప్పుడు వాటాలు.
– టి. డి. పి. అంటేనే డీపీటీ.
– లంచాలకు ప్రతిఫలంగానే పత్రికల్లో, టీవీల్లో ఎల్లో ప్రచారాలు!.. అంటూ వారు చంద్రబాబు కుటుంబం, ఎల్లో మీడియాపై విరుచుకుపడ్డారు.