వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌ కన్నుమూత

తూర్పుగోదావరి: వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు కొద్ది రోజుల కిందట కరోనా సోకడంతో హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. మోహ‌న్ కుటుంబ స‌భ్యుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఫొన్‌లో ప‌రామ‌ర్శించారు. మోహన్ మృతి పట్ల ఎంపీలు అనురాధ, మార్గాని భరత్‌, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సంతాపం తెలిపారు. 

Back to Top