రఘురామ కృష్ణంరాజుకు రెండే పనులు.. తాగడం, వాగడం

రాక్షస బ్యాచ్‌తో చేరి శునకానందం పొందుతున్నాడు

సిగ్గు, శరం ఉంటే ఏపీకి వచ్చి మాట్లాడాలి

రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలి

వేల కోట్లు దోపిడీ చేసిన వ్యక్తి నీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం

దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి గెలవాలి

సీఎం వైయస్‌ జగన్‌ రాముడు కాబట్టే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్‌ 

తాడేపల్లి: వేల కోట్ల రూపాయలు దోచుకుతిన్న రఘురామ కృష్ణంరాజు నీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, ఇలాంటి వ్యక్తులను రాజకీయాల్లో ఉండనిస్తే భావితరాలను మోసం చేసివారమవుతామని, తక్షణమే రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్‌ డిమాండ్‌ చేశారు. పార్టీ తరఫున అనర్హత వేటుకు నోటీస్‌ ఇచ్చినప్పుడల్లా తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం లేదని, ఏ తప్పు చేయలేదని తలదాచుకుంటున్న రఘురామకృష్ణంరాజు.. పిటీషన్‌ ద్వారా లోపల దాక్కున్న బురదపాము ఇవాళ బయటపడిందన్నారు. ఇప్పటికైనా లోక్‌సభ స్పీకర్‌ గమనించి.. రాజ్యాంగ ఉల్లంఘన, పద్ధతి, విధానం లేని రఘురామకృష్ణంరాజుకు బుద్ధి వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ నందిగం సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రాజ్యాంగంలోని 10 షెడ్యుల్‌లో ఉన్న పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. అనర్హత వేటు వేయాలన్నారు. పార్టీ నుంచి అతనిపై అనర్హత వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రఘురామకృష్ణంరాజు లాంటి వ్యక్తులను ఉపేక్షిస్తే భవిష్యత్తులో రాజకీయాలకు ప్రమాదకారిగా మారే అవకాశం ఉందన్నారు. 

రఘురామ కృష్ణం రాజు మాటలు వైయస్‌ఆర్‌ సీపీ తరఫున వ్యక్తిలా కాకుండా.. పక్క పార్టీలు, వ్యక్తులకు మేలు చేసే విధంగా ఉన్నాయని, వాళ్లకు దాయాదిగా పనిచేస్తున్నాడని ఎంపీ నందిగం సురేష్‌ మండిపడ్డారు. అతనికున్న సీబీఐ, ఏసీబీ కేసుల నుంచి బయటపడే మార్గం ఇవాళ టీడీపీ, బీజేపీ భజన చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇన్ని పాపాలు చేస్తున్న రఘురామకృష్ణంరాజును పైనున్న దేవుడు కూడా కాపాడలేడని, జైలు జీవితం గడపడం ఖాయమన్నారు. 

కడప నుంచి తనను చంపడానికి బ్యాచ్‌ను దింపారని రఘురామకృష్ణంరాజు ఆరోపిస్తున్నాడని, కుక్కను ఎవరైనా చంపుతారా..? బోన్‌ వేసి పడతారని చురకంటించారు. రఘురామ కృష్ణంరాజుకు రెండే పనులు.. తాగడం, వాగడం. సిగ్గు, శరం, నైతిక విలువలు ఉంటే ఏపీకి వచ్చి తిరగాలని, ఎల్లో మీడియా కవరేజ్‌ ఇస్తుందని ఢిల్లీలో కూర్చొని ప్రెస్‌మీట్లు పెట్టి వాగడం మానుకోవాలన్నారు. వేల కోట్లు దోచుకుతిని నీతి గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

సీఎం వైయస్‌ జగన్‌ రాముడితో సమానం కాబట్టే ప్రజలంతా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. రాక్షస బ్యాచ్‌లో రఘురామకృష్ణం రాజు కూడా చేరాడని, ప్రెస్‌మీట్లు, డిబేట్లు పెట్టుకొని వాళ్లకు వారే నవ్వుకుంటూ శునకానందం పొందుతున్నారన్నారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో రాక్షస బ్యాచ్‌కి దిమ్మతిరిగే జవాబు ప్రజలు చెప్పారని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చెంప చెల్లుమనే తీర్పు రాబోతుందన్నారు. ఢిల్లీలో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడే చవట, సన్యాసికి దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చెయ్యాలని ఎంపీ నందిగం సురేష్‌ సవాల్‌ విసిరారు. 
 

Back to Top