పవన్‌ కళ్యాణ్‌ అరాచకవాదిలా ప్రవర్తిస్తున్నారు

ప్రజలు రెండు చోట్ల బుద్ధి చెప్పినా పవన్‌కు జ్ఞానోదయం కాలేదు

దేవాలయాల నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

పవన్‌ ట్వీట్లపై బహిరంగ చర్చకు సిద్ధమా?

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సవాలు

తాడేపల్లి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ అరాచకవాదిలా ప్రవర్తిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఆలయాల నుంచి వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నామని వివరించారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న ట్వీట్లు, టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టి పారేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు.  ఏ అర్హత ఉందని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. కొత్తగా మేం చట్టం తీసుకురాలేదన్నారు. గతంలో ఉన్న వ్యవహారాలను ఈ రోజు కొనసాగిస్తున్నామన్నారు. ఎండోమెంట్‌ శాఖ కొత్తగా ఏదో చేస్తున్నట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. దేవాలయాల నుంచి తీసుకున్న దానికంటే అధికంగా ప్రభుత్వమే అధిక నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. పిచ్చివాడిలాగా, ఉన్మాదిలాగా, అరాచకవాదిలాగా పవన్‌ కళ్యాణ్‌ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు ఐదు నెలలు కూడా కాలేదన్నారు. పవన్‌కు చిత్తశుద్ధి, దమ్ము ఉంటే ఆయన చేసిన ట్వీట్లపై బహిరంగ చర్చకు రావాలన్నారు. మత విద్వేషాలు రగిలిస్తూ రాష్ట్రంలో చీలికలు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్‌కు తెలియకపోతే మీ పార్టనర్‌, మీ దత్తత తండ్రి చంద్రబాబును అడగాలని సూచించారు. ఐరోపా వెళ్లినప్పుడు ఒక మాట, హైదరాబాద్‌లో మరో మాట, అమరావతిలో ఇంకో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌కు రెండు చోట్ల ప్రజలు బుద్ధి చెప్పినా జ్ఞానోదయం కలుగలేదని పేర్కొన్నారు. చంద్రబాబు చేతిలో ఆయన కీలుబొమ్మగా మారి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు చూసి పక్కదారి పట్టించేలా కుట్రలు చేస్తున్నారని తెలిపారు. అజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులకు ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రావడం లేదని చెప్పారు. పవన్‌..మీరు చేసిన ట్విట్లపై వైయస్‌ఆర్‌సీపీ తరఫున చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాలు చేశారు. అవినీతి, హిందు ధర్మంపై దాడి జరిగితే ఐదు సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదని పవన్‌ను ప్రశ్నించారు.

Read Also: ఓటుకు కోట్లు కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే ఆర్కే

Back to Top