లిక్కర్‌ వ్యవహారంలో సిట్‌ విచారణ తీరు దారుణం

వైయస్ఆర్‌సీపీ లీగల్‌ విభాగం అధ్యక్షుడు మనోహర్‌ రెడ్డి

తాడేప‌ల్లి: లిక్కర్‌ వ్యవహారంలో సిట్‌ విచారణ తీరు దారుణంగా ఉంద‌ని వైయస్ఆర్‌సీపీ లీగల్‌ విభాగం అధ్యక్షుడు మనోహర్‌ రెడ్డి ఆక్షేపించారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

మ‌నోహ‌ర్‌రెడ్డి ఏమ‌న్నారంటే..

  • లిక్కర్‌ వ్యవహారంలో సిట్‌ విచారణ తీరు దారుణంగా ఉంది
  • చట్టాన్ని, నియమాల్ని, నిబంధనలను పట్టించుకోవడంలేదు
  • దర్యాప్తు కోణంలో కాకుండా ఎలా వేధించాలన్న కోణంలో సిట్‌ వ్యవహరిస్తోంది
  • మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల వ్యవహారంలో సిట్‌ కక్షపూరిత ధోరణి కనిపిస్తోంది
  • ఉదయం 10 గంటలకు వీళ్లిద్దరూ సిట్‌ విచారణకు హాజరయ్యారు:
  • రాత్రి 10:30 వరకూ వాళ్లిద్దరీ పంపించలేదు 
  • పన్నెండున్నర గంటల పైబడి విచారణ చేస్తున్నారు
  • ఇది పూర్తిగా నిబందనలకు విరుద్ధం 
  • ఇద్దరూ సీనియర్‌ సిటిజన్స్ అన్న విషయాన్నికూడా సిట్‌ మరిచిపోయింది
  • సిట్‌కు చట్టమన్నా, న్యాయస్థానాలన్నా, రాజ్యాంగమన్నా, సుప్రీం కోర్టు తీర్పులన్నా ఎలాంటి గౌరవం లేదు
  • పదేపదే కోర్టులు హెచ్చరిస్తున్నా వీళ్ల తీరు మారలేదు
  • వ్యక్తుల స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు
  • లిక్కర్‌ వ్యవహారంలోనే ఒక నిందితుడి పట్ల సిట్‌ ఇలానే వ్యవహరిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టింది
  • సీనియర్‌ సిటిజన్స్‌ వ్యవహారంలో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పింది
  • అతడి విషయంలో ఇంటికి వెళ్లి విచారించాలని, సాయంత్రం 5 గంటల తర్వాత విచారణ వద్దని చెప్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది:
  • కాని, కోర్టు తీర్పులు సిట్‌కు ఎక్కడం లేదు 
  • ఏదో జరిగిపోయిందన్న భావనను ప్రజలకు కల్పించడానికి ఇలాంటి ఎత్తుగడలకు దిగుతోంది
  • ఈ అంశాలన్నింటినీ గౌరవ న్యాయస్థానం దృష్టికి వెళ్తున్నాం:
  • సిట్‌ అధికారుల వ్యవహార తీరును కోర్టుకు తెలియజేస్తాం
  • సిట్‌ అధికారులు రాజకీయ నాయకుల్లా వ్యవహరించడం సరికాదు
     
Back to Top