వైయ‌స్‌ జగన్‌పై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం

ఈసీకి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌  ఫిర్యాదు
 

 విజయవాడ: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.  సీఈఓతో వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు సహా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు భేటీ అ‍య్యారు. సీఎం వైయ‌స్‌ జగన్‌పై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం ఉందని ఈసీకీ  వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.  

 

         ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై నిన్న బస్సుయాత్ర సందర్భంగా విజయవాడలో జరిగిన దాడి వెనక కుట్ర కోణం ఉందని పార్టీ రాష్ర్ట ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై దాడి ఘటనపై సచివాలయంలోని ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు అందించారు.  శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఎంపీ లు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, నందిగామ సురేష్,mlc  లేళ్ళ అప్పిరెడ్డి, ఎంఎల్ఏ మల్లాది విష్ణు,మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు,పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ మనోహర్ రెడ్డి లు ఫిర్యాదు చేశారు.

     ఈ సందర్బంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బస్సు యాత్ర సందర్భంగా జగన్ గారిపై దాడి రాష్ర్టమంతటిని కుదిపేసింది. అంతా షాక్ గురయ్యారు.కేవలం అదృష్టం మాత్రమే జగన్ గారిని కాపాడింది. ఆ రాయి లేదా ఉపయోగించినది ఏదైనా సరే కొంచెం కిందకు తగిలినా కనుచూపు పోయేది.అలాగే కణతకు తగిలితే ప్రాణాపాయం ఉండేది. సంఘటనను దేశం అంతా ఖండించింది. ప్రధాని నరేంద్రమోదిగారు కూడా ఖండించారు. పలు పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలంతా కూడా ఖండించి జగన్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాని ఇక్కడ మన రాష్ర్టంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కూడా ఖండించినప్పటికీ ఆ పార్టీ సీనియర్ నేతలు,పార్టీ జాతీయప్రధానకార్యదర్శి అయిన లోకేష్ జరిగిన దుర్గటన అంతా డ్రామా అని విమర్శలు చేశారు.  జగన్ గారు తనంతట తాను చేయించుకున్నడ్రామాగా వర్ణించడం, హేళన.. అబ్యూజ్ చేయడం...కోడికత్తి 2.0 అనడం....అసలు వీళ్ళు మనుషులా.. రాక్షసులా అన్నట్లుగా ప్రవర్తించడం హేయమైన విషయం. ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల కమీషన్ ఆధీనంలోనే ఇప్పుడు అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. దాడి జరగడానికి కారణం ఎవరని మరోకోణంలో చూసినట్లయితే చంద్రబాబు ఈ మధ్యనే కాదు చాలా రోజులనుంచి టిడిపి కార్యకర్తలను,ప్రజలను రెచ్చగొట్టేరీతిలో మాట్లాడటం జరగుతోంది. ప్రస్టేషన్ నిరాశా నిసృహల మద్య మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి,పార్టీ అధ్యక్షుడు అనే విషయం గుర్తించకుండా సాటి మనిషి అనికూడా జగన్ గారిని గుర్తించకుండా చంద్రబాబు రెచ్చగొట్టారు.

బస్సుయాత్ర ప్రారంభమైనప్పటినుంచి జగన్ గారికి ప్రజలలో విపరీతమైన మధ్దతు లభించడం చూస్తున్నారు. విజయవాడ చేరుకునేసరికి అది మరింతగా పెరిగింది. అదంతా చూసి తట్టుకోలేక రెచ్చగొట్టేవ్యాఖ్యలు మరింతగా పెంచారు. ఇలాంటి భాష గతంలో ఎన్నడూ వినలేదు. రాయి తీసుకోండి...దున్నపోతును ఓడించండి అనడమే కాదు మీరు కన్నెర్ర చేయండి జగన్ గారిని మసిగా చేయండి అంటూ దారుణంగా మాట్లాడారు. మొత్తంగా చూస్తే ఓ పధకం ప్రకారం కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్ ఆన్ లైఫ్ త్రెట్ అనేది మా పార్టీ అధ్యక్షుడు జగన్ గారిపై జరిగింది. జగన్ గారికి ఆ రాయి తగిలి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కంటికి తగిలింది. అంటే ఓ వ్యక్తికి తగిలిన తర్వాత పక్కనే ఉన్న వ్యక్తికి అంతే ఫోర్స్ తో తగిలింది అంటే అది చేత్తో విసిరిందా లేదా ప్రయోగించిన అతను షార్ప్ షూటర్ అయినా అయి ఉండాలి.

గురితప్పకుండా కొట్టగలిగేవాడై ఉండాలి. ఎందుకంటే జగన్ గారు పక్కకు తిరగడం వల్ల కొంత ప్రమాదం తప్పింది. పక్కనే భవనాలు ఉన్నాయి.ఇతర కట్టడాలు ఉన్నాయి. ఇదంతా దర్యాప్తులో తేలాలి. ముందే అనుకుని ప్లేస్ వెదుక్కుని పధకం ప్రకారం చేసినట్లుగా కనిపిస్తోంది. రాజకీయ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేరు. చంద్రబాబు రెచ్చగొట్టి ఇలాంటివి చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు ఎన్నికల కమీషన్ కు నివేదించాం. గత కొన్ని రోజులుగా కూడా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసామన్నారు. ఈసి కూడా టిడిపి వారికి నోటీసులు ఇస్తున్నట్లున్నారు. కాని ఫలితం కనపడటం లేదు. ఇకపై ఇలాంటి రెచ్చగొట్టేస్పీచ్ లు చేయకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని ఈసిని కలసి కోరామని వివరించారు. సంఘటనపై విచారణ చేయమని డిజిపిని కలసి పార్టీనేతలు ఫిర్యాదు చేస్తారని తెలియచేశారు.

 

      గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈసిని బెదిరించారు. జగన్ గారు అలాంటివాటిని ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు ఎన్నికల కమీషన్ ఆధీనంలోనే వ్యవస్దలన్నీ ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చంద్రబాబులా ఎవరిని ఇన్ ఫ్లూయన్స్ చేయబోమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దాడి చేసినవారు తప్పించుకోవాలని చూస్తున్నారు ఎందుకంటే వారు అనుకున్నది జరగలేదనేది వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఇటీవల ప్రసంగాలలో బూతులు తిట్టటం, రెచ్చగొట్టడం చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు అసమర్దత వల్లనే జరుగుతోంది. ఇలాంటి చర్యలను నియంత్రించాలని ఈసిని కోరామని అన్నారు.

 

   సంఘటన జరిగిన వెంటనే వైయస్సార్ సిపి నేతలు నిముషాలలో స్పందించారనే విమర్శలపై మాట్లాడుతూ పార్టీ అధినేత పై దాడి జరిగితే వెంటనే స్పందించడంపై కూడా దుష్ప్రచారం చేయడం దారుణం అన్నారు. భద్రతా వైఫల్యం అనడం అంటే ఇష్యూను డైవర్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అన్నారు. గతంలో అలిపిరి సంఘటన జరిగినప్పుడు భద్రతా వైఫల్యం అనలేదు. దానిపై వైయస్ గారు అప్పట్లో సంఘటనకు నిరసనగా ధర్నా చేశారు. ఎవరైనా ఇలాంటి దాడి జరిగినప్పుడు దాడికి గురైన వ్యక్తి త్వరగా కోలుకోవాలని కోరుకోవాలి. చంద్రబాబు మాటల్లో అది కనిపించడం లేదన్నారు.  ఈరోజు జగన్ గారిపై జరిగింది రేపు మరొకరిపైన జరగచ్చు. ఇలాంటివి సరైన విధానం కాదనేది నా అభిప్రాయం.టిడిపి నేతలు ఇదంతా డ్రామా అనడం సరైనవిధానం కాదు. ప్రజలు వారి వ్యాఖ్యలు బరితెగింపుతనం గమనిస్తూనే ఉన్నారని అన్నారు. టిడిపి పాలనలో తాము,తమ పార్టీ వారి అరాచకాలను శాంతియుతంగా,ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొన్నామని అన్నారు. ని్న్న జరిగిన దాడిలాంటి సంఘటనలు లేవు. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించారు. బస్సుయాత్ర ఈ రోజు విశ్రాంతి తీసుకుని రేపటినుంచి తిరిగి ప్రారంభమవుతోంది. ప్రజాకోర్టులో ఉన్నాం. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు మేం చెప్పాలనుకుంది చెప్పి... వారినుంచి తీర్పు పొందాలని భావిస్తున్నామని తెలియచేశారు.

 

      కార్యక్రమంలో పార్టీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ నారాయణమూర్తి,పార్టీ నేతలు చల్లా మధుసూధన్ రెడ్డి,వరప్రసాదరెడ్డి,పార్టీ విద్యార్ది విభాగం రాష్ర్ట అద్యక్షుడు పానుగంటి చైతన్య పలువురు పార్టీ నేతలు ఉన్నారు.

 

 

Back to Top