రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
‘వెన్నుపోటుతో బాబు పీఠమెక్కిన రోజు ఇదే’
01 Sep 2020 11:34 AM
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కుట్రలతో అధికారాన్ని చేపట్టారని, ఆయన స్వయం ప్రకటిత మేధావి అని ట్విటర్ వేదికగా చురకలంటించారు.‘వెన్నుపోటుతో, అప్రజాస్వామిక పద్ధతుల్లో చంద్రబాబు పీఠమెక్కిన రోజు ఇది. ఏనాడూ చంద్రబాబు ప్రజల్లోంచి అధికారాన్ని తెచ్చుకోలేదు. ఎత్తులు, కుట్రలు, మేనెజ్మెంట్ వ్యవహారాలతో.. అనుకూల మీడియా చిత్రించిన స్వయంప్రకటిత మేధావిగా బండి ఈడ్చారు’అని సజ్జల పేర్కొన్నారు. కాగా, 1995, సెప్టెంబర్ 1 న చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు.