తాడేపల్లి: రాష్ట్రంలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైయస్ఆర్సీపీ నూతన సమన్వయకర్తలను నియామించారు.ఈ నియమకాలను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద రాష్ర్ట మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు. పార్టీ అధ్యక్షులు,ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాలమేరకు 11 నియోజకవర్గాల ఇంచార్జుల స్థానంలో కొత్త వారిని నియమించడం జరిగిందని వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు: ప్రత్తిపాడు - బాలసాని కిరణ్ కుమార్ కొండెపి - ఆదిమూలపు సురేష్ వేమూరు - వరికూటి అశోక్ బాబు తాడికొండ - మేకతోటి సుచరిత సంతనూతలపాడు - మేరుగు నాగార్జున చిలకలూరిపేట - మల్లెల రాజేశ్ నాయుడు గుంటూరు పశ్చిమ - విడదల రజనీ అద్దంకి - పాణెం హనిమిరెడ్డి మంగళగిరి - గంజి చిరంజీవి రేపల్లె - ఈవూరు గణేష్ గాజువాక - వరికూటి రామచంద్రరావు రాష్ర్ట మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ....రేపటి నుంచి పార్టీ వ్యవహరాలన్నీ వీరు పర్యవేక్షిస్తారని తెలియచేశారు.ఏ ఒక్కరినీ పార్టీ వదులుకోదని..అందరి సేవలు వినియోగించుకుంటుంది. 175 కి 175 స్థానాల్లో పార్టీ అభ్యర్దులు విజయం సాధించాలని మార్పులు చేర్పులు. చేస్తూ వైయస్ జగన్ నిర్ణయించారు. చేనేత కార్మికులు, బడుగు బలహీనవర్గాలు జగన్ గారు వారందరికీ ఒక ధైర్యాన్నిచ్చారు. మాటలు చెప్పడం కాదు...చేతల్లో చేసి చూపించారు. అందులో భాగంగానే మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డిగారే గంజి చిరంజీవిని తీసుకొచ్చి జాయిన్ చేశారు. మంగళగిరి అభ్యర్దిగా చిరంజీవిని నిర్ణయించారు. ఆర్కే గారికి ఏ రకంగా సముచిత స్థానం ఇవ్వాలో అలానే చేయడం జరుగుతుందని వివరించారు. ఏ ఒక్కరినీ పార్టీ వదులుకోవాలనేది లేదని స్పష్టం చేశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రత్యేక మైన స్థానం ఇవ్వాలని లక్ష్యంతోనే ఇలాంటి నిర్ణయాలు. ఇది మొదటి దశగా జరుగుతుంది.175 సీట్లనూ పరిశీలించుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. పార్టీ అంటే ఎమ్మెల్యేతో పాటు క్యాడర్ కూడా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అందరికి అన్ని అవకాశాలు కల్పిస్తాం..వీలైనంతవరకు సముచిత స్థానం ఇవ్వాలనేది వైయస్ జగన్ గారు లక్ష్యం. ప్రస్తుతం ఈ మార్పుల వల్ల కొందరికి బాధ ఉండొచ్చు కానీ..అందరూ పార్టీకి సహకరిస్తారని..శ్రీ వైయస్ జగన్ గారి నిర్ణయాలు అందరూ అర్ధం చేసుకుంటారు. పార్టీ మనది..తల్లిలాంటిదని వారందరూ సహకరిస్తారని వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... వైయస్ జగన్ గారు పార్టీని స్థాపించినప్పటి నుంచీ ఈ 12 ఏళ్లలో పార్టీని ప్రజలకు జవాబుదారీగా ఉంచారు. వైయస్ జగన్ గారి దృష్టిలో శాసన సభ్యునికి ఎంత విలువ ఉంటుందో కార్యకర్తకూ అంతే విలువ ఉంటుందని అన్నారు. పార్టీకి కార్యకర్తలే ప్రాణం అన్నారు. ప్రజలకు మంచి సేవ చేయాలంటూ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా ఈ 11 నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.వీటికి సంబందించి భవిష్యత్తులోనూ మార్పులు ఉండవచ్చు. శాస్త్రీయంగా సర్వేల ప్రకారం ప్రజల్లో మమేకం అయ్యే రీతిలో మెరుగైన ఫలితాల కోసం మార్పులు చేశారు. దీన్ని వేరేరకంగా చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పార్టీ ఒక వ్యక్తి కోసమో..వ్యక్తుల కోసమో ఉండదు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే కూర్చోబెట్టి మాట్లాడతామని అన్నారు. ఎందుకు ఇలా చేశాం అనేది అంతర్గతంగా కూడా వారికి వివరిస్తామని అన్నారు.సహజంగానే స్థానికంగా మా నాయకుడికి ఇబ్బంది వచ్చిందని కొందరు నేతలు రియాక్ట్ కావచ్చు. ఈ ప్రభుత్వం మంచి మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రావాలి..ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వైయస్ జగన్ గారు అధ్యక్షులుగా శాస్త్రీయంగా లోతుగా ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక సెన్సేషనల్ కోసం ఆయన ఏదీ చేయడం లేదు. ఆయన ఏది చేసినా ఓపెన్ గా చెప్పారు. ప్రజలకు మళ్లీ మనం సేవ చేసే పరిస్థితి రావాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు గాలిలో మాటలు చెప్పి...ప్రజలను కన్ఫ్యుజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులకు ఒక దారీ తెన్నూ లేకుండా వారున్నారు. వైయస్ జగన్ గారు ప్రజలకు సేవ చేసే దిశగా సమీక్షిస్తూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలియచేశారు. సామాజిక న్యాయాన్ని అడ్రస్ చేయాలనే లక్ష్యంతో సాధ్యమైనంతగా ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీలకు పెద్ద పీట వేయాలనే ఇవన్నీ జరుగుతున్నాయి.ఇందులో మీడియాకు కూడా పెద్దగా సందేహాలు అక్కర్లేదు. భవిష్యత్తులో కూడా కొన్ని చేంజెస్ ఉండచ్చు...ఉండకపోవచ్చని స్పష్టం చేశారు.