తాడేపల్లి: మహాకవి యోగి వేమన జయంతి సందర్భంగా వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ మేరకు వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వైయస్ జగన్ ఎక్స్ వేదికగా.. యోగి వేమన పద్యాలు కేవలం పద్యాలు మాత్రమే కాదు… అవి జీవిత సత్యాలు. మనిషి ఆత్మపరిశీలనకు, జీవన ప్రయాణానికి ఆ పద్యాలు వెలుగు రేఖలు . “మేడిపండు చూడ మేలిమైయుండు”, “ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు”, “ఆత్మశుద్ధి లేని ఆచారమేల” అంటూ మనిషి మారితేనే సమాజం మారుతుందని శతాబ్దాల క్రితమే చెప్పిన వేమన జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ హృదయపూర్వక నివాళులు’అని పేర్కొన్నారు.