డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డికి ఘ‌న నివాళి 

అంధుల ఆశ్ర‌మంలో కేక్ క‌ట్ చేసిన వైయ‌స్ భార‌తి

వైయ‌స్ఆర్ జిల్లా:  పులివెందులలో డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి వైయ‌స్  భారతి నివాళులు అర్పించారు. అంధుల ఆశ్రమంలో కేక్‌ కట్‌ చేసిన గంగిరెడ్డి అభిమానులు.. దుస్తులు పంపిణీ చేశారు. వైయ‌స్ రాజారెడ్డి భవన్ వద్ద గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి వైయ‌స్ మనోహర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్, పార్టీ శ్రేణులు నివాళి అర్పించారు. 
 

Back to Top