పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

విజయవాడ: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతను పరిశ్రమలతో అనుసంధానించే కార్యక్రమంలో భాగంగా అప్రెంటీస్‌ విధానం అమలుపై విజయవాడలో సెమినార్‌ నిర్వహించారు. ఈ వర్క్‌షాపును పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, రాష్ట్రంలో నిరుద్యోగుల స‌మ‌స్య‌ ఉండకూడదనేది సీఎం వైయస్‌ జగన్‌ ఆశయమన్నారు. పరిశ్రమల స్థాపనకు ఎవరు ముందుకొచ్చినా పూర్తి సహకారం అందిస్తామని, ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషిచేస్తామన్నారు. 

Back to Top