చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
దసరా ఉత్సవాలకు రండి
25 Sep 2019 2:10 PM
సీఎం వైయస్ జగన్ ను ఆహ్వానించిన మంత్రి వెల్లంపల్లి
ఈనెల 29నుండి ఇంద్ర కీలాద్రిపై దసరా ఉత్సవాలు
విజయవాడ: ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్ర కీలాద్రి దసరా ఉత్సవాలకు రావాలని ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆహ్వానించారు. ఈ మేరకు తాడేపల్లి నివాసంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మంత్రి వెలంపల్లి, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆలయ ఈవో సురేష్ కుమార్, ఆలయ వేదపండితులతో కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.
ఉత్సవాలలో అమ్మవారికి జరిగే ప్రత్యేక సేవలను సీఎంకు మంత్రి వివరించారు. దసరా ఉత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.