వైయస్‌ఆర్‌ కుటుంబంలోని ఆ ముగ్గురు మహిళలే ఆదర్శం

ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ
 

తాడేపల్లి: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలోని వైయస్‌ విజయమ్మ, వైయస్‌ భారతమ్మ, వైయస్‌ షర్మిలమ్మ నేటి మహిళలకు ఆదర్శమని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, స్థానికులకు పరిశ్రమల్లో 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇటీవల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చట్టం చేశారని తెలిపారు. మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా వారి కాళ్లపై నిలబడాలని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోందని, అందులో భాగంగానే దశలవారీగా మద్యపాన నిషేదం కార్యక్రమాన్ని మొదలుపెట్టారని చెప్పారు. మహిళా కమిషన్‌ అంటే నేరం జరిగిన తరువాత వెళ్లి పరామర్శించేది కాదని, నేరం జరగకముందే వాటిని నియంత్రించేందుకు ఈ కమిషన్‌ పని చేస్తుందన్నారు. చిన్నతనంలోనే ఆడ,మగ తేడా లేకుండా చూసేందుకు కృషి చేస్తామన్నారు.  వైయస్‌ జగన్‌  రాష్ట్రంలోని మహిళలందరికీ అన్నగా అండగా ఉంటారని చెప్పారు. ఈ ప్రభుత్వంలో మహిళా కమిషన్‌ సాధికారత సాధిస్తుందన్నారు. మహిళలందరికీ మంచి రోజులు వచ్చాయన్నారు. వైయస్‌ఆర్‌ కుటుంబంలోని వైయస్‌ విజయమ్మ, భారతమ్మ, షర్మిలమ్మ ఈ ముగ్గురు మహిళలు కష్టాలు ఎలా ఎదుర్కొన్నారో..మహిళలకు వారే ఆదర్శప్రాయమన్నారు. మహిళలు బాధగా ఉన్నప్పుడు ఈ ముగ్గురిని గుర్తు చేసుకోవాలన్నారు. కష్టాలు ఎప్పుడు ఉండవన్నారు. వైయస్‌ఆర్‌ కుటుంబంలోని ముగ్గురు మహిళలు చిరునవ్వుతో ఎలా ఎదుర్కొన్నారో..మనం కూడా అలాగే ఎదుర్కొందామన్నాని, చేయి చేయి కలిసి కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు.

Back to Top