వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
స్థానిక స్వపరిపాలనతో నవశకానికి నాంది
15 Aug 2019 12:58 PM
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
గ్రామ వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన సీఎం
విజయవాడ: ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేర్చేది వాలంటీర్లే అని వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్థానిక స్వపరిపాలనతో నవశకానికి వైయస్ జగన్ నాంది పలికారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను వైయస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని చెప్పారు. లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలన్నారు. కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు చూడకూడదని, చివరికి ఏ పార్టీ అన్నది చూడకూడదన్నారు. మనం చేసే మంచిని చూసి ఓటు వేసే పరిస్థితి తీసుకురావాలన్నారు. గ్రామంలో మంచి జరగాలన్నదే తన లక్ష్యమని వైయస్ జగన్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రామ సెక్రటేరియట్ను పూర్తిగా ఉపయోగపడేలా చూడాలన్నారు.