తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి (05.10.2023, 06.10.2023) ఢిల్లీలో పర్యటించనున్నారు. 05.10.2023 షెడ్యూల్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. అక్కడ 1 జన్పథ్ నివాసంలో రాత్రికి బస 06.10.2023 షెడ్యూల్ ఉదయం 9.45 గంటలకు 1 జన్పథ్ నివాసం నుంచి విజ్ఞాన్ భవన్కు చేరుకుని వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.