నేడు వైయస్‌ జగన్‌ పర్యటన వివరాలు

అమరావతి: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి గడువు మంగళవారంతో  ముగుస్తుండగా..చివరి రోజున వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు జిల్లాలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.నేడు ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి, 11.30 గంటలకు కర్నూలు,మధ్యాహ్నం రెండు గంటలకు చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగే ప్రచార సభతో వైయస్‌ జగన్‌ తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు.
నేడు డోన్,ఆళ్లగడ్డలో వైయస్‌ విజయమ్మ ఎన్నికల ప్రచారం
వైయస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ  చివరి రోజు  కర్నూలు జిల్లాలోని డోన్,ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు.
 

Back to Top