సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను స‌త్క‌రించిన ఎంపీడీవోలు

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌, ఏపీ ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు ఘ‌నంగా స‌త్క‌రించారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఆ సంఘాల నేత‌లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీడీవోల పదోన్నతికి అడ్డంకిగా ఉన్న సమస్యను వన్‌ టైం మెజర్‌ విధానం ద్వారా పరిష్కరిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా ఎంపీడీవోలకు పదోన్నతి అవకాశాలు రావడమే కాక, పంచాయతీ రాజ్‌ శాఖలోని ఎంపీడీవో దిగువస్ధాయిలోని 12 కేడర్లకు చెందిన వేలాదిమంది ఉద్యోగులకు కూడా పదోన్నతి అవకాశాలు మెరుగుపడనున్నాయని సీఎంకి  ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు వివ‌రించారు. ఈ  ముఖ్యమంత్రిని సత్కరించిన వారిలో ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య, ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు జీ.వీ.నారాయణ రెడ్డి, కే.శ్రీనివాస రెడ్డి, కే.ఎన్‌.వీ.ప్రసాదరావు, నాతి బుజ్జి త‌దిత‌రులు ఉన్నారు. 

Back to Top