తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యులు, ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యులు ముందుకొచ్చారు. వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని సీఎం వైయస్ జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్దికి అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించిన సీఎం, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు సీఎం అంగీకారం తెలిపారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో తమ ట్రస్ట్కు అత్యంత ప్రతిష్టాత్మకమైన స్వామినారాయణ్ గురుకుల్ యూనివర్శిటీని ఏర్పాటుచేసేందుకు 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు సన్నాహకాలు జరిగాయని, ఆయన అకాల మరణంతో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయినట్లు సీఎంకి వివరించిన ట్రస్ట్ ప్రతినిధులు
శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ గ్రూప్కి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్గడ్, రాజస్ధాన్, న్యూఢిల్లీ, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలలో 52 కు పైగా విద్యాసంస్ధలు.
ఈ సమావేశంలో ట్రస్టీ మెంబర్ సుఖ్వల్లభ్ స్వామి, విజయవాడ బ్రాంచ్ ఆర్గనైజర్ మంత్రస్వరూప్ స్వామి, ట్రస్ట్ సభ్యులు శ్రవణ్ప్రియ్ స్వామి, విషుద్జీవన్ స్వామి, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. తదితరులు పాల్గొన్నారు.