సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో ఎస్‌ఎల్‌బీసీ నూతన కన్వీనర్‌ నవనీత్‌ కుమార్ భేటీ

  
తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి  క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డితో ఎస్‌ఎల్‌బీసీ నూతన కన్వీనర్‌ నవనీత్‌ కుమార్‌ ( జీఎం, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) భేటీ అయ్యారు. ఇటీవలే ఎస్‌ఎల్‌బీసీ నూతన కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన నవనీత్‌ కుమార్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డీజీఎం వేగే రమేష్ కూడా ఉన్నారు.

Back to Top