సాతులూరు గ్రామంలో 'గడప గడపకు మన ప్రభుత్వం'

 మంత్రి విడ‌ద‌ల ర‌జినికి ఘ‌న స్వాగ‌తం
 

ప‌ల్నాడు:  పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  మంత్రి విడదల రజిని పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా గ్రామస్తులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. మూడేళ్ల పాల‌న‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అందించిన సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రతి గడపకు వెళ్లి మంత్రి వివరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు.  

Back to Top