జాతీయ భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రాంతీయ సదస్సు

వ‌ర్చువ‌ల్‌గా హాజ‌రైన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అమ‌రావ‌తి: జాతీయ భద్రత మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పై బెంగుళూరు వేదికగా ప్రాంతీయ సదస్సు నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌ద‌స్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పాల్గొన‌గా, ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు.  ఏపీ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సదస్సులో సీఎం వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి పాల్గొన్నారు.  ప్ర‌స్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఈ సదస్సుకు హాజరుకాలేకపోయాన‌ని సీఎం  వైయస్‌.జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో ద్రవ్యవినిమయబిల్లును ఆమోదించాల్సిన నేపధ్యంలో ఈ సమావేశానికి హాజరుకాలేకపోయాన‌ని, అందుకే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్నాన‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కేంద్ర మంత్రి అమిత్‌షాకు తెలిపారు. మా ప్రభుత్వం తరపున డీజీపీ ఈ సదస్సుకు హాజరయ్యార‌ని, సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటామ‌ని  సీఎం   వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Back to Top