కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
జాతీయ భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రాంతీయ సదస్సు
24 Mar 2023 1:11 PM
వర్చువల్గా హాజరైన సీఎం వైయస్ జగన్
అమరావతి: జాతీయ భద్రత మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పై బెంగుళూరు వేదికగా ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పాల్గొనగా, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్గా హాజరయ్యారు. ఏపీ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సులో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఈ సదస్సుకు హాజరుకాలేకపోయానని సీఎం వైయస్.జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో ద్రవ్యవినిమయబిల్లును ఆమోదించాల్సిన నేపధ్యంలో ఈ సమావేశానికి హాజరుకాలేకపోయానని, అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నానని సీఎం వైయస్ జగన్ కేంద్ర మంత్రి అమిత్షాకు తెలిపారు. మా ప్రభుత్వం తరపున డీజీపీ ఈ సదస్సుకు హాజరయ్యారని, సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.