కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ఆర్సీపీ నేత మజ్జి శ్రీనివాసరావుకు రెడ్క్రాస్ అవార్డు
25 Oct 2022 5:39 PM
విజయనగరం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన ప్రతిష్టాత్మక ఇండియన్ రెడ్ క్రాస్ అవార్డుకు ఎంపికయ్యారు. చీపురుపల్లిలో సుమారు రూ.80లక్షలతో నిర్మితమవుతున్న బ్లడ్బ్యాంకు ఏర్పాటుకు జెడ్పి ఛైర్మన్ ఎంతగానో కృషి చేశారు. ఈ బ్లడ్బ్యాంకు ఏర్పాటుకు పెద్దమొత్తంలో విరాళాలను సమకూర్చడానికి కృషి చేయడమే కాకుండా, రక్తదానాన్ని ప్రోత్సహించినందుకు, లైఫ్ మెంబర్లను పెద్ద సంఖ్యలో చేర్పించినందుకు, 2020-21 సంవత్సరానికి గానూ ఆయన ఈ గౌరవాన్ని పొందారు. ఈ నెల 28న ఉదయం 11.30 గంటలకు, విజయవాడలోని లబ్బిపేట, ఎస్.కన్వన్షన్ హాలులో జరిగే కార్యక్రమంలో, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతులమీదుగా, అవార్డును అందుకోనున్నారు. ఈ అరుదైన పురస్కారాన్ని పొందిన మజ్జి శ్రీనివాసరావును ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్సీపీ నాయకులు అభినందించారు.