మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సీఎం వైయస్ జగన్ను కలిసిన పీవీ సింధు
13 Sep 2019 11:46 AM
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కొద్దిసేపటి క్రితం మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో సీఎంను కలిసిన సింధును ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. సీఎంను కలిసిన వారిలో సింధు తల్లిదండ్రులతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు.
దశాబ్దాలుగా భారతీయులకి అందని ద్రాక్షగా మిగిలిపోయిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పసిడి పతకాన్ని పీవీ సింధు ఇటీవల సాధించారు. జపాన్ షట్లర్ ఒకుహరాతో బాసెల్ (స్విట్జర్లాండ్) వేదికగా జరిగిన ఫైనల్లో 21-7, 21-7 తేడాతో సింధు అలవోకగా నెగ్గి.. ఈ టోర్నీలో స్వర్ణం సాధించిన తొలి భారత షట్లర్గా రికార్డ్ నెలకొల్పిన విషయం తెలిసిందే.