సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఓబెరాయ్ గ్రూప్ ఆఫీస‌ర్‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని  ద ఓబెరాయ్‌ గ్రూప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రాజారామన్‌ శంకర్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో రాజారామ‌న్ శంక‌ర్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ను క‌లిసి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. 

ఏపీలో ఓబెరాయ్‌ ప్రాజెక్ట్‌లకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్‌ విండో విధానంలో ఇవ్వాలని అధికారులను ఆదేశించిన సీఎం

ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, హర్సిలీహిల్స్ లో హోటల్స్‌ ఏర్పాటుచేసేందుకు ఆసక్తి చూపించిన ఒబెరాయ్‌ గ్రూప్, దీంతో పాటు పాడేరు పరిసర ప్రాంతాల్లో టూరిజం సెంటర్‌ నిర్వహించేందుకు కూడా తాము ఆసక్తిగా ఉన్నామని వెల్లడి

రాష్ట్రంలో దాదాపు రూ. 1,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు, తద్వారా  ప్రత్యక్షంగా 1500 మందికి, పరోక్షంగా 11,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన ఓబెరాయ్‌ గ్రూప్‌.

అన్ని హోటల్స్‌ కూడా 7 స్టార్‌ సౌకర్యాలతో విల్లాల మోడల్‌లో రూపకల్పన చేస్తామన్న ఓబెరాయ్‌ గ్రూప్‌. 

ఈ సమావేశంలో పాల్గొన్న టూరిజం అండ్‌ కల్చర్‌ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, సీఎంవో అధికారులు.

Back to Top