ప్రజలు ప్రశాంతంగా ఉండడం చంద్రబాబుకు ఇష్టంలేదు

వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి 
 

తాడేపల్లి: ప్రజలు ప్రశాంతంగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకపోతే ఏంటని ఈ నిద్రాణశక్తులు అంటున్నాయని ఆయన ట్వీట్ ట్వీట్‌ చేశారు. ఉగ్రవాద సంస్థలు వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు కోవర్టులు, స్లీపర్ సెల్స్ ను సమాజంలో ప్రవేశపెడతాయని, ప్రజా సంక్షేమం కోసం ఐకమత్యంగా పనిచేయాల్సిన చోట ఈ విధంగా ద్రోహులను చొప్పించడం, సమయం చూసి వారు విధ్వంసానికి దిగడం టెర్రర్ గ్రూపుల కంటే ఘోరం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోంది కూడా అదేనని, చంద్రబాబు సీఎంగా లేని రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదని, వ్యవస్థలోకి ఆయన చొప్పించిన స్లీపర్ సెల్స్ కరాఖండీగా చెబుతున్నాయని విమర్శించారు. దేశం కంటే కులమే గొప్పదని, తమ దేవుడు చంద్రబాబు అంతకంటే గొప్పవాడని, ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లు రాకపోతే మాకేంటి అని ఈ నిద్రాణ శక్తులు అంటున్నాయని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
 

తాజా వీడియోలు

Back to Top