రాజ్యసభ: పౌరసత్వ సవరణ బిల్లుకు వైయస్ఆర్ సీపీ మద్దతు తెలిపింది. రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని మతాలను సమానంగా చూడాలనేది వైయస్ఆర్ సీపీ అభిమతం అని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, చివరకు రాజకీయాలకు అతీతంగా ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ఈ బిల్లుకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని, దురుద్దేశపూర్వకంగా వలసలను ప్రోత్సహించి జాతీయ భద్రతకు ముప్ప కలిగించడాన్ని అంగీకరించమన్నారు. Read Also: వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో వైయస్ఆర్ సీపీలోకి భారీ చేరికలు