రూ.10 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్ర‌ధాని శంకుస్థాపన 

విశాఖపట్నం:  ఆంధ్రప్రదేశ్‌లో రూ.10,742 కోట్లతో చేప‌ట్టిన‌ వివిధ ప్రాజెక్టులకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో క‌లిసి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.   

ప్రాజెక్టుల వివరాలు..
► రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు

► రూ. 3,778 కోట్లతో రాయిపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే

► రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణం

► రూ. 152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు

► రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు శంకుస్థాపన

► రూ. 211 కోట్లతో నరసన్నపేట పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు జాతికి అంకితం

► రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్‌జీసీ యు ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేశారు. 
కార్య‌క్ర‌మంలో గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌,  కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. 

Back to Top