ఎమ్మెల్సీగా రుహుల్లా ప్ర‌మాణ స్వీకారం  

అమరావతి: ఏపీ శాసన మండలిలో కొత్తగా ఎన్నికైన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేశారు. మండ‌లి  చైర్మ‌న్ మోషేన్ రాజు ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకార ప్రసంగం వినపడకుండా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. మైనారిటీ ఎమ్మెల్సీని ప్రమాణం చేయనివ్వాలని వైయ‌స్సార్‌సీపీ కోరగా, అయితే ఏంటి.. మైనారిటీ ఎమ్మెల్సీ అని మాకు తెలుసులే అంటూ లోకేష్‌ వ్యాఖ్యానించారు. మైనారిటీ సభ్యుడిని అవమానించిన లోకేష్‌పై వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top