గూళూరు చెరువు ను  పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా 

చిత్తూరు: భారీ వర్షాలకు పుత్తూరు మండలం తడుకు  పంచాయతీ ఎగువ గుళూరు లోని చెరువును వైయ‌స్ఆర్‌సీపీ న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప‌రిశీలించారు. సోమ‌వారం మండల రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులతో  ఎమ్మెల్యే ఆర్కే రోజా చెరువును సంద‌ర్శించారు. చెరువు నిండ‌టంతో ఆమె సంతోషం వ్య‌క్తం చేస్తూ..చెరువు క‌ట్ట ప‌టిష్ట‌త‌పై, ముందస్తు జాగ్రత్తల గురించి ఆరా తీశారు. అనంత‌రం చెరువుకు హార‌తి ఇచ్చి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

Back to Top